Begin typing your search above and press return to search.

సొంత పార్టీ లో ద్రోహుల మీద కసిగా రగిలి పోతున్న ముగ్గురు మంత్రులు

By:  Tupaki Desk   |   10 Jan 2020 9:08 AM GMT
సొంత పార్టీ లో ద్రోహుల మీద కసిగా రగిలి పోతున్న ముగ్గురు మంత్రులు
X
నా అనుకున్నవారు మోసం చేస్తే .. ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆలా మోసపోయిన వారు సరైన సమయం కోసం వేచి చూస్తుంటారు. ఆ సమయం రాగానే వారు చేసే పని వారు చేసి బదులుకు బదులు తీర్చుకోవాలని అనుకుంటారు. ఆలా గత అసెంబ్లీ ఎన్నికలలో సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచి ..మళ్లీ ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చేసరికి వారి దగ్గరికే క్యూ కట్టారు. దీనితో అప్పుడు మీ టైం మీరు చేసి చూపించారు ..ఇప్పుడు మా టైం వచ్చింది మేము ఏంటో చేసి చూపిస్తాం అని లెక్క సెటిల్ చేసే పనిలో ఉన్నారట ఆ ముగ్గురు మంత్రులు. కరీంనగర్ జిల్లాలో మినిస్టర్ల మాటల వెనక అర్థం ఇదేనా క్యాడర్‌ లో జరుగుతున్న చర్చ ఏంటి?

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రులు ఇటీవల చేసిన వ్యాఖ్యలు టీఆర్‌ఎస్ లో కొందరికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఒక్కో మంత్రి ఒక్కోలా స్పందించినా ముగ్గురి మాటల వెనకా అర్ధం ఒకటే అనే చర్చ సాగుతోంది. ఏడాది కిందట జరిగిన ఘటనపై ఈ ముగ్గురు మంత్రులు సీరియస్‌గా ఉన్నారు. కొంతమంది చేసిన గాయానికి, వారు ఇప్పటికీ లోలోపల పగతో రగిలి పోతున్నారు. ఇంకా వేచి చూస్తే, మంచిది కాదనుకున్నారో ఏమో గాని, ఇక అదను చూసి దెబ్బ కొట్టాలని వారు డిసైడ్ అయ్యారట. తమకు ద్రోహం చేసిన శత్రువు ఎవరో తెలిసినా, ఏడాది కాలంగా మౌనంగా ఉన్న మంత్రులు ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా తమ ఆపరేషన్ మొదలు పెట్టారట. కొంతమంది తెలిసి మరికొంత మంది తెలియక నూతిలో పడ్డ ఎలుక మాదిరిగా ఆందోళన చెందుతున్నారట. ఆ ముగ్గురు ఎవరు అంటే ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్.

ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ఉన్న మంత్రులకు, గత ఎన్నికలు గెలుపు కంటే గుణపాఠాన్నే నేర్పించాయి గత అసెంబ్లీ ఎన్నికలు. తమకు అనుచరులుగా ఉన్న వారంతా, తీరా సమయానికి వ్యతిరేకులుగా మారి, తమ నాయకలనే ఓడించే ప్లాన్ చేశారట. ఎన్నికల సమయంలో ఎవరినీ దూరం పెట్టలేని, అలాగే నిందించలేని పరిస్థితి. ఎలాగోలా ప్రజల మద్దతుతో విజయం సాధించి, సీనియారిటి, పార్టీ విధేయత కోటలో మంత్రి పదవులు సంపాదించుకున్నారు. దీనితో ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి వెన్నుపోటుదారుల సంగతి తేల్చేందుకు సిద్ధమయ్యారట. ఇక ఈటెల రాజేందర్. తనను ఓడించడానికి సొంతపార్టీలో వున్న చాలామంది ట్రై చేశారని, ఇప్పటికీ రగిలిపోతున్నారాయన. పదవుల కోసం ఈటెల చుట్టూ తిరగడం పదవులు రాగానే ఈటెలకు తలనొప్పిగా మారడం హుజూరాబాద్ రాజకీయాల్లో సాధారణమైంది. నమ్మక ద్రోహం చేసిన వారికి మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం కుదరదంటూ బహిరంగంగానే చెప్పేశారు ఈటెల.

నమ్మిన వారే వెన్ను పోటు పొడిచారని ఆగ్రహంతో వున్నారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌. ప్రజల్లో ఉన్న ఆదరాభిమానాలు, టీఆర్ఎస్‌ మీద ఉన్న విశ్వాసంతో గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నానని అంటున్నారు. ముగ్గురు మంత్రులకీ మున్సిపల్ ఎన్నికల రూపంలో, ఒక మంచి ఆయుధం దొరికినట్టయ్యింది. నమ్మకద్రోహం చేసినవారిని పక్కకు పెట్టె అవకాశాన్ని కల్పించాయి పోల్స్. వ్యతిరేకులు, నమ్మకద్రోహులు, వెన్నుపోటుదారుల కోటాలో లిస్ట్ తయారు చేసుకున్న మంత్రులు, వారికి టికెట్ ఇవ్వకుండా పొలిటికల్ దెబ్బ తీయడానికి ప్లాన్ చేశారట. అయితే , ఈ మంత్రుల లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో తెలియదు కానీ , పార్టీలో సీనియర్లు గా చలామణి అవుతున్న వారిలో కొంతమందిపై వేటుపడే అవకాశం ఉంది. చూడాలి మరి మంత్రుల ప్రతీకార చర్యలు ..పార్టీలో ఎలాంటి అలజడిని సృష్టిస్తాయో .....