Begin typing your search above and press return to search.

బెంగ‌ళూరులో కిరాత‌కం - ముగ్గురు పిల్ల‌ల హ‌త్య‌

By:  Tupaki Desk   |   9 Sep 2015 11:46 AM GMT
బెంగ‌ళూరులో కిరాత‌కం - ముగ్గురు పిల్ల‌ల హ‌త్య‌
X
అక్ర‌మ సంబంధం చిచ్చు ముగ్గురు చిన్నారుల ఊసురు తీసింది. పిల్ల‌ల‌కు అంకుల్ వ‌ర‌సైన వ్య‌క్తే అత్యంత కిరాత‌కంగా ఈ దారుణానికి ఒడిగ‌ట్టాడు. బెంగ‌ళూరులో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఇలియాస్ బేగ్‌, నాజియ బేగం అనే దంప‌తుల‌కు ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. వీరి ఇంటికి అప్పుడ‌ప్పుడు వ‌చ్చే ఫ‌యూమ్‌ బేగ్ (24) అనే వ్య‌క్తి నాజియ బేగంపై క‌న్నేసి ఆమెను లొంగ‌దీసుకున్నాడు. త‌ర్వాత వీరిద్ద‌రి మ‌ధ్య వివాహేత‌ర సంబంధం బ‌ల‌ప‌డింది. ఈ విష‌యం న‌జియా భ‌ర్త ఇలియాస్‌ కు తెలియ‌డంతో ఆమెను మంద‌లించాడు. అయితే ఆమె ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పురాలేదు స‌రిక‌దా ఫ‌యూమ్‌ తో త‌న సంబంధాన్ని కొన‌సాగిస్తూనే ఉంది. దీంతో ఇలియాస్ న‌జియాతో త‌న బంధాన్ని తెగ‌తెంపులు చేసుకుని హైద‌రాబాద్‌ కు వెళ్లిపోయాడు.

భ‌ర్త నుంచి విడిపోవ‌డంతో న‌జియా-ఫ‌యూమ్ బంధం మ‌రింత బ‌ల‌ప‌డింది. ఫయూమ్ బేగ్ నిత్యం నాజియా బేగం ఇంటికి వెళ్లి ఆమెతో శారీర‌క సంబంధం కొన‌సాగిస్తున్నాడు. ఒక రోజు ఫ‌యూమ్ న‌జియా ఇంటికి వెళ్లిన స‌మ‌యంలో ఆమె మ‌రో వ్య‌క్తితో బెడ్ రూంలో ఉండ‌డం చూశాడు. అప్ప‌టి నుంచి ఆమెపై క‌క్ష పెంచుకున్న ఫ‌యూమ్ ఆమె పిల్ల‌ల‌ను అంత‌మొందించేందుకు ప‌థ‌కం వేశాడు. ఆగస్టు 27న స్కూల్ నుంచి ఇంటికి వెళుతున్న వారిని కిడ్నాఫ్ చేసి చంపి మ్యాన్‌ హోల్‌ లో ప‌డేశాడు.

పిల్ల‌లు ఇంటికి రాక‌పోవ‌డంతో న‌జిమా బ‌న‌స్వాధి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఈ కేసును స‌వాల్‌ గా తీసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో ద‌ర్యాప్తు చేశారు. చివ‌ర‌కు అనుమానంతో ఫయూమ్ బేగ్ ను అదుపులోకి తీసుకుని విచారించ‌డంతో అత‌డు నేరం అంగీక‌రించాడు. అక్ర‌మ సంబంధం మ‌రో అక్ర‌మ సంబంధానికి కార‌ణ‌మై చివ‌ర‌కు ముగ్గురు పసిపిల్ల‌ల ప్రాణాల‌ను బ‌లిగొంది.