Begin typing your search above and press return to search.

థర్డ్ వేవ్ ఆల్రెడీ వచ్చేసింది.. మేయర్ కీలక ప్రకటన

By:  Tupaki Desk   |   8 Sept 2021 9:56 AM IST
థర్డ్ వేవ్ ఆల్రెడీ  వచ్చేసింది.. మేయర్ కీలక ప్రకటన
X
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఇంకా తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. కరోనా రెండవ వేవ్‌లో దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించిన తరువాత, ఇప్పుడు భారత్ మూడవ వేవ్‌ ను ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది. గత కొన్ని రోజులుగా కేరళలో కరోనా కేసులు పెరుగుతున్నాయి, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆంక్షలను అమలు చేయాల్సి వచ్చింది. అదే సమయంలో, ఇప్పుడు మహారాష్ట్రలో కూడా మూడవ వేవ్‌ కి సంబంధించి ప్రభుత్వం అప్రమత్తమైంది.

మహారాష్ట్రలో గణేష్ చతుర్థి ప్రారంభానికి ముందు, కరోనా వైరస్ యొక్క మూడవ వేవ్‌ గురించి ఆందోళన పెరిగింది. ముంబై మేయర్ కిశోరి పెడ్నేకర్ ఇంట్లో వినాయక చతుర్థి జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆమె, ముంబై మేయర్‌ గా, నేను 'మేరా ఘర్, మేరా బప్పా' ని అనుసరించబోతున్నాను. నేను ఎక్కడికీ వెళ్లను, ఎవరినీ నా దేవుడి వద్దకు తీసుకురాను అని పేర్కొన్నారు. కరోనా యొక్క మూడవ వేవ్‌ ను ఆపడానికి చాలా ముఖ్యం, మేయర్ మూడో వేవ్ కరోనా రావడం లేదని పేర్కొని, అది ఆల్రెడీ వచ్చేసిందని అన్నారు.

ఆగస్టు నెలలో నమోదైన మొత్తం కేసుల్లో 28శాతం కేసులు కేవలం ఈ నెల తొలి ఆరు రోజుల్లోనే రిపోర్ట్ కావడం గమనార్హం. ఈ మహానగరంలో సోమవారం 379 కొత్త కేసులు నమోదవ్వగా ఐదు కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,46,725, మరణాల సంఖ్య 15,998, రికవరీలు 7,24,494లకు చేరాయి. పండుగల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కరోనా పెరుగుదల అధికారుల్లో ఆందోళనలు కలిగిస్తున్నాయి. గతేడాది ఫస్ట్ వేవ్ కూడా ఇలాంటి తరుణంలోనే ఫెస్టివ్ సీజన్ ప్రారంభంలో మొదలైంది. ఈ నేపథ్యంలోనే సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్ని రాజకీయ ర్యాలీలు, మతపరమైన వేడుకలను రద్దు చేసుకోవాలని తెలిపారు. ప్రజల ప్రాణాలు ముఖ్యమని, పండుగలు భవిష్యత్‌ లోనైనా జరుపుకోవచ్చని హెచ్చరించారు.