Begin typing your search above and press return to search.

బిపిన్ రావత్ మరణం: మరో బాంబు పేల్చిన సుబ్రహ్మణ్య స్వామి

By:  Tupaki Desk   |   9 Dec 2021 8:36 AM GMT
బిపిన్ రావత్ మరణం: మరో బాంబు పేల్చిన సుబ్రహ్మణ్య స్వామి
X
బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మరో బాంబు పేల్చారు. దేశంలో జరుగుతున్న అన్నింట్లోనూ వేలిపెట్టే స్వామి తాజాగా పేల్చిన బాంబు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని షేక్ చేసేలా ఉంది. ఏకంగా భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ హెలిక్యాప్టర్ ప్రమాదాన్ని స్వామి అనుమానించి సంచలనం రేపారు. బిపిన్ రావత్ మృతికి కారణమైన హెలిక్యాప్టర్ ప్రమాదంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

బిపిన్ రావత్ హెలిక్యాప్టర్ ప్రమాదం వెనుక కుట్రకోణం ఉండొచ్చన్న అనుమానాలను సుబ్రహ్మణ స్వామి వ్యక్తం చేశారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన షాకింగ్ గా చెప్పొచ్చు. దేశ భద్రతకు పెద్ద హెచ్చరికగా అభివర్ణించారు.

తమిళనాడులోని ఊటికి సమీపంలో బుధవారం ఆర్మీ హెలిక్యాప్టర్ కుప్పకూలిన ఘటనలో బిపిన్ రావత్, ఆయన సతీమణి సహా 13మంది దుర్మరణం చెందడం తెలిసిందే. మరో వ్యక్తి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

దుర్ఘటనపై ఫైనల్ రిపోర్ట్ రానందున తాను దీనిపై మాట్లాడడం చాలా కష్టమని సుబ్రహ్మణ్య స్వామి చెప్పుకొచ్చాడు. అయితే తమిళనాడు లాంటి సేఫ్ జోన్ లో మిలటరీ హెలిక్యాప్టర్ పేలిన విషయం సాధారణ అంశం కాదని సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంలో తీవ్రమైన దర్యాప్తు అవసరం అన్నారు.

ప్రజల్లో నెలకొన్న అనుమానాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో ఈ ఘటనపై విచారణ జరిపించి నిజనిజాలు తేల్చాలని సుబ్రహ్మణ్య స్వామి కోరారు.

కాగా ఈ హెలిక్యాప్టర్ ఘటనపై భారత వైమానిక దళం విచారణకు ఆదేశించింది. ఈరోజు బిపిన్ రావత్ అంత్యక్రియలు డిల్లీలో జరుగనున్నాయి.