Begin typing your search above and press return to search.

హీరోయిన్‌ కోసం కోర్టు హాల్‌ నుండి అందరిని పంపిన జడ్జ్‌

By:  Tupaki Desk   |   5 July 2022 10:35 AM GMT
హీరోయిన్‌ కోసం కోర్టు హాల్‌ నుండి అందరిని పంపిన జడ్జ్‌
X
చట్టం ఏ ఒక్కరికి చుట్టం కాదు.. న్యాయం అనేది ప్రతి ఒక్కరికి సమానంగా దక్కాల్సిందే అనేది మన రాజ్యంగా.. ప్రజాస్వామ్యం చెబుతున్న విషయాలు. చట్టం ను అధిగమించిన వారికి కఠిన శిక్షలు పడాల్సిందే అనేది న్యాయ వ్యవస్థ యొక్క ఉద్దేశ్యం.

కాని కొన్ని సార్లు పరిస్థితి చూస్తుంటే న్యాయం అనేది సెలబ్రెటీలకు.. ప్రముఖులకు ఒక మాదిరిగా సామాన్యులకు మరో విధంగా అందుతుందేమో అనిపిస్తుంది.

సాధారణంగా అయితే కోర్టు లో కేసు విచారణ అనేది మీడియా మరియు ఇతర న్యాయవాదుల సమక్షంలో వాదిస్తూ జరుగుతంది. కాని బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ కంగనా రనౌత్‌ యొక్క కేసు మాత్రం కోర్టు హాల్‌ నుండి అందరిని పంపించి కేవలం జడ్జ్‌ మరియు ప్రత్యర్థి పిటీషనర్ తరపు లాయర్ మాత్రమే ఉన్నాడు. ఈ విచారణ అత్యంత స్పెషల్‌ అన్నట్లుగా మీడియా వర్గాల వారు చర్చించుకుంటున్నారు.

అసలు విషయానికి వస్తే 2020 సంవత్సరంలో కంగనా ఒక టాక్ షో లో తనను అవమానిస్తూ.. పరువుకు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసిందని జావేద్ అక్తర్ పరువు నష్టం పిటిషన్ ను దాఖలు చేసింది. తాజాగా అంధేరిలోని మెట్రోపాలిటిన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు లో విచారణకు వచ్చింది. కంగనా కోర్టుకు హాజరు అయ్యేందుకు తన ప్రైవసీ ని జడ్జ్‌ ను కోరింది.

ఆమె కోరిక మేరకు ఆమె కోర్టు హాల్‌ లో ఉన్న సమయంలో మీడియా వారికి మరియు ఇతర లాయర్ లకు అక్కడ ఉండే అవకాశం లేకుండా బయటకు పంపించారు. కోర్టు హాల్‌ లో ఇలా జరగడం విడ్డూరంగా ఉందంటూ కొందరు మీడియా వర్గాల వారు చెవులు కొరుక్కుంటున్నారు.

సెలబ్రెటీలకు మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా విచారణ కోరుకునే ఏ ఒక్కరి అయినా అలా విచారణకు అవకాశం ఉంటుంది.. ఇదేమి కంగనా కోసం పెట్టిన కొత్త రూల్ కాదు అంటూ కొందరు లాయర్ లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.