Begin typing your search above and press return to search.

బొప్పాయి తోటలో దారుణ హత్య..చేసిందెవరో తెలిస్తే వణుకే

By:  Tupaki Desk   |   21 May 2021 7:30 AM GMT
బొప్పాయి తోటలో దారుణ హత్య..చేసిందెవరో తెలిస్తే వణుకే
X
ఏపీలోని ప్రకాశం జిల్లా రాజధాని ఒంగోలు. ఈ పట్టణానికి కాసింత దూరంలోనే ఉంటుంది టంగుటూరు. మద్రాసుకు వెళ్లే ప్రతి రైలు ఈ ఊరు మీద నుంచే వెళ్లాలి. రానున్న రోజుల్లో ఒంగోలు పట్టణంలో కలిసిపోయే ఈ చిన్న ఊళ్లో జరిగిన దారుణ హత్యాచారం షాకింగ్ గానే కాదు.. సంచలనంగా మారింది. 65 ఏళ్ల తన తల్లి కనిపించటం లేదని రొయ్యల చెరువుల వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడికి టంగుటూరు మండలం మల్లవరప్పాడు గ్రామ శివారులో బొప్పాయి తోటలు కూడా ఉన్నాయి. ఈ తోటలో పని చేసేందుకు పశ్చిమ బెంగాల్ నుంచి ఇద్దరు కూలీల్ని తీసుకొచ్చారు. వారిద్దరిని బొప్పాయి తోటలో మే 13న పెట్టారు.

పెద్ద వయస్కురాలైన బాధిత మహిళ మే 14న తోట వద్దకు కాపలాగా వెల్లింది. తోట గేటు తీసే సమయంలో ఆమెకు.. అక్కడ పని చేసే కుర్రాడికి గొడవైంది. దీంతో.. ఆ పని కుర్రాడిని ఆమె మందలించింది. దీంతో కోపం పెంచుకున్న ఆ కుర్రాడు.. తోటలో పని చేసుకుంటున్న ఆమెను పారతో కొట్టాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అనంతరం ప్రాణం లేని ఆమెపై కామవాంఛ తీర్చుకున్నాడు. అనంతరం డెడ్ బాడీ మీద పైపులు.. గడ్డి వేసి తన తప్పు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.

బొప్పాయి తోటకు వెళ్లిన తన తల్లి ఇంటికి రాకపోవటంతో ఆమె కొడుకు పలుచోట్ల తిరిగాడు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తర్వాతి రోజు బొప్పాయి తోటకు వెళ్లగా.. అక్కడ దుర్వాసన రావటంతో అక్కడ వెతగ్గా.. శవంగా పడి ఉన్న తన తల్లిని చూసి బోరుమన్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసును విచారించి.. పెద్ద వయస్కురాలైన మహిళను చంపి.. అత్యాచారం చేసింది బెంగాల్ కు చెందిన కుర్రాడేనని గుర్తించారు. ఆధారాలతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మైనర్ కావటంతో అతడ్ని జువైనల్ హోంకు తరలించారు.