Begin typing your search above and press return to search.

మెట్రోలో ఆ లవర్స్ ఎంతగా రెచ్చిపోయారంటే.

By:  Tupaki Desk   |   8 Nov 2019 5:01 AM GMT
మెట్రోలో ఆ లవర్స్ ఎంతగా రెచ్చిపోయారంటే.
X
ఊహించని సీన్ ఒకటి ఢిల్లీ మెట్రో లో దర్శనమిచ్చింది. ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమ కలాపంతో రెచ్చిపోయారు. తమ చుట్టూ ఉన్న వారిని మరిచిపోయి.. వారు చేసిన చేష్టలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ మెట్రో లో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నాలుగు రోజుల క్రితం ఢిల్లీ మెట్రో రైల్లో ఎక్కిన ఒక యువజంట.. చుట్టూ ఉన్న వారిని పట్టించు కోవటం మానేశారు. సన్నిహితంగా ఉండటం ఒక ఎత్తు అయితే.. విచక్షణ మరిచి పబ్లిక్ గా ముద్దులు పెట్టేసుకోవటంతో చుట్టూ ఉన్న ప్రయాణికులు ఇబ్బందికి గురయ్యారు. మెట్రో రైలు అన్నాక పెద్దోళ్లే కాదు.. చిన్నారులు సైతం ప్రయాణిస్తారన్న విషయాన్ని మర్చిపోకూడదు.

బహిరంగంగా సాగించిన ప్రేమ కలాపాల్ని అదే ట్రైన్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు ఒకరు తన చేతిలో ఉన్న సెల్ ఫోన్ తో చిత్రీకరించారు. అక్కడితో ఆగకుండా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో.. వీరి ప్రేమ కలాపాలు ఇప్పుడు ఆన్ లైన్ లో దర్శనమిస్తున్నాయి. ఈ యువజంట తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనులు చేస్తున్న వారిపై పోలీసు కేసులు పెట్టాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం మోరల్ పోలీసింగ్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నా.. పబ్లిక్ గా ఇలా దరిద్రపు గొట్టు పనులు చేయకపోతే ఏమైందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వారి సంఖ్యే ఎక్కువ గా ఉండటం గమనార్హం. అయినా.. ఏకాంతం కావాలంటే మెట్రో రైలే ఎక్కాలా? ఇంకెన్ని లేవంటూ ఫైర్ అవుతున్న వారు లేకపోలేదు.