Begin typing your search above and press return to search.

కేసీఆర్ కాళేశ్వరం అందుకే వెళ్లాడు: బండి సంజయ్

By:  Tupaki Desk   |   20 Jan 2021 1:30 PM GMT
కేసీఆర్ కాళేశ్వరం అందుకే వెళ్లాడు: బండి సంజయ్
X
తన కొడుకు కేటీఆర్ ను సీఎం చేయడానికే కాళేశ్వరంకు కేసీఆర్ వెళ్లాడని..కేసీఆర్ తన స్వార్థం కోసం యాగాలు, పూజలు చేస్తున్నాడని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశాడు. త్వరలోనే కేటీఆర్ సీఎం అవుతారన్న ఊహాగానాల నేపథ్యంలో బండి సంజయ్ ఈ హాట్ కామెంట్స్ చేశారు.

నిన్న అకస్మాత్తుగా కాళేశ్వరంకు సీఎం వెళ్లాడని అది కూడా శ్రీమతిని తీసుకొని వెళ్లాడని.. తన కల సాకారం అయ్యిందని అంటున్నారని బండి సంజయ్ అన్నారు. ఆ కల కేటీఆర్ ను సీఎం చేయడమేనని అన్నారు.

మూడురోజులుగా కేసీఆర్ తన ఫాంహౌస్ లో దోష నివారణ పూజలు చేశారని.. వాటిని కలపడానికి మాత్రమే కేసీఆర్ కాళేశ్వరం వెళ్లాడని బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసని.. కేసీఆర్ ఎందుకు వెళ్లాడనే అనుమానం అందరికీ వచ్చిందని అన్నాడు. నటించడం.. అబద్ధాలు చెప్పడం.. మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట అని అన్నారు.

ఉద్యమకారులను కాకుండా.. కొడుకును సీఎం చేస్తున్నాడని.. దళితుడిని ఎందుకు సీఎం చేయడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈటల, హరీష్ రావులకు కేసీఆర్ అన్నాయం చేస్తున్నాడని.. కరోనా టైంలో ఈటలను బద్నాం చేశాడని బండి ఆరోపించారు.

సీఎం కాళేశ్వరం ఎందుకు వెళ్లాడో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే నాకు చెప్పారన్న బండి.. ఉద్యమ ద్రోహులే కేటీఆర్ సీఎం కావాలని అంటున్నారని అన్నారు.