Begin typing your search above and press return to search.
బ్యాంకాక్ లో ఏపీ యువకుడి మృతి
By: Tupaki Desk | 14 Aug 2018 3:40 PM ISTవిహార యాత్ర కాస్త విషాధ యాత్రగా మిగిలిపోయింది. చిన్నపాటి నిర్లక్ష్యం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. స్విమ్మింగ్ ఫూల్ ఏపీ యువకుడిని మింగేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు బ్యాంకాక్ లో మృతిచెందాడు. ప్రమాదవశాత్తూ స్మిమ్మింగ్ ఫూల్ లో పడడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి ఈత రాకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు.
హైదరాబాద్ హెచ్.డీ.ఎఫ్.సీ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తున్న వెంకటేశ్ బ్యాంకు పని నిమిత్తం ఇటీవలే బ్యాంకాక్ కు వెళ్లాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులకు బ్యాంకాక్ పోలీసులు సమాచారం అందించారు. కొడుకు మరణ వార్త విన్న వింటనే తల్లిదండ్రులు భోరుమన్నారు. మృతదేహాన్ని భారత్ కు రప్పించడానికి అధికారు ప్రయత్నిస్తున్నారు. బ్యాంకాక్ లో వెంకటేశ్ మరణంతో స్వగృహంలో విషాధచాయలు అలుమకున్నాయి.
హైదరాబాద్ హెచ్.డీ.ఎఫ్.సీ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తున్న వెంకటేశ్ బ్యాంకు పని నిమిత్తం ఇటీవలే బ్యాంకాక్ కు వెళ్లాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులకు బ్యాంకాక్ పోలీసులు సమాచారం అందించారు. కొడుకు మరణ వార్త విన్న వింటనే తల్లిదండ్రులు భోరుమన్నారు. మృతదేహాన్ని భారత్ కు రప్పించడానికి అధికారు ప్రయత్నిస్తున్నారు. బ్యాంకాక్ లో వెంకటేశ్ మరణంతో స్వగృహంలో విషాధచాయలు అలుమకున్నాయి.
