Begin typing your search above and press return to search.

కెనడాలో తెలుగు విద్యార్థి మృతి.!

By:  Tupaki Desk   |   7 Aug 2019 5:04 AM GMT
కెనడాలో తెలుగు విద్యార్థి మృతి.!
X
కెనడాలోని తెలుగు విద్యార్థి మృతి చెందారు. కెనడా లోని టోరొంటో నగరం సమీపంలో ఉన్న ఓ సరస్సులో మునిగి చనిపోయినట్లు అతడి స్నేహితులు తెలిపారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని మంఖల్ కు చెందిన నరేందర్ రెడ్డి-శైలజ దంపతుల కుమారుడు జగన్ మోహన్ రెడ్డి.

జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ లోని స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు. ఉన్నత చదువుల కోసం 2012లో కెనడాకు వెళ్లాడు. ప్రస్తుతం పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు.

కాగా టొరొంటోని ఓ సరస్సులో శవమై కనిపించాడు. ఈ విషయాన్ని అతడి స్నేహితులు హైదరాబాద్ లోని అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. టొరొంటోలోని పీల్ రీజినల్ పోలీసులు అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి స్నేహితులను విచారించారు.

కాగా జగన్ కు పదేళ్ల వయసున్నప్పుడే జగన్ తండ్రి నరేందర్ రెడ్డి గుండెపోటుతో మరణించారు. తల్లి శైలజ ఎంతో కష్టపడి కుమారుడిని ఉన్నత చదువులు చదివించారు. కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడు చనిపోవడం తల్లి శైలజకు కుంగదీసింది. ఆమె బోరున విలపించారు. జగన్ మృతితో మంఖల్ లో విషాద చాయలు అలుముకున్నాయి.