Begin typing your search above and press return to search.

తెలంగాణ ఎంసెంట్ విద్యార్థికి ఏపీలో సెంటర్

By:  Tupaki Desk   |   4 May 2019 11:29 AM GMT
తెలంగాణ ఎంసెంట్ విద్యార్థికి ఏపీలో సెంటర్
X
మొన్నటికి మొన్న ఇంటర్ మీడియెట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలు విద్యార్థుల ప్రాణాలుతీశాయి. ఆ నిర్లక్ష్యం మరువక ముందే మరో పొరపాటు శాపంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా కౌన్సిల్ తన తప్పులను కొనసాగిస్తోంది. ఇది విద్యార్థులను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.

తాజాగా తెలంగాణలో ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న ఇక ఇంటర్ విద్యార్థికి దిమ్మదిరిగే షాక్ లభించింది. ఎంసెట్ హాల్ టికెట్ ను అందుకున్న ఆ విద్యార్థి పరీక్షా కేంద్రం ఎక్కడ అని చూస్తే దిమ్మదిరిగి బొమ్మ కనపడింది.

మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన ఎం శ్రావ్య అనే విద్యార్థి హాల్ టికెట్ (1913k03435)ను అందుకుంది. ఆమెకు పరీక్షా కేంద్రాన్ని మాత్రం తెలంగాణలో కాకుండా ఆంధ్రాలో వేశారు. ఈ విద్యార్థికి కర్నూలు జిల్లాలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించారు. ఆమె కర్నూలులో పరీక్షా కేంద్రాన్ని కేటాయించాలని ఆప్షన్ కూడా పెట్టలేదు. అయినా ఆమెకు అక్కడే పరీక్షా కేంద్రాన్ని అధికారులు కేటాయించారు. ఇది పొరపాటున జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. తెలంగాణ ఎంసెట్ ను ఏపీలో ఎలా రాయాలో అర్థం కాక ఆ విద్యార్థి జుట్టు పీక్కుంటున్నారు.

సదురు విద్యార్థికి మే 9న తెలంగాణ ఎంసెట్ పరీక్ష ఉంది. విద్యార్థి పరీక్షా కేంద్రాన్ని మార్చడానికి ఇంకా ఐదురోజుల తక్కువ సమయమే ఉంది. ఒకవేళ కరెక్షన్ జరగకపోతే ఆ విద్యార్థి భవిష్యత్తే అంధకారంలో పడుతుంది.

ఇది ప్రస్తుతానికి ఈ ఒక్క విద్యార్థికి వచ్చిన సమస్య మాత్రమే. ఇంకా చాలా మంది విద్యార్థులు హాల్ టికెట్లు చూసుకుంటే పరిస్థితి ఏంటనేది అర్థమవుతుంది. విద్యాశాఖ నిర్లక్ష్యం వల్ల ఇలా విద్యార్థుల భవిష్యత్ అంధకారమయ్యే పరిస్థితి తలెత్తుతోంది. ఇప్పటికే ఈ విద్యార్థి హాల్ టికెట్ ను బోర్డు మార్చాల్సిన అవసరం ఉంది.