Begin typing your search above and press return to search.

ఆపరేషన్ తెలంగాణలో బీజేపీ స్కెచ్ ఇదే

By:  Tupaki Desk   |   7 Jun 2019 6:02 AM GMT
ఆపరేషన్ తెలంగాణలో బీజేపీ స్కెచ్ ఇదే
X
ఏపీలో టీడీపీని బలహీన పరిచే కుట్రలకు బీజేపీ తెరతీయబోతుందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ పార్టీ ఎంపీ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎదురుతిరగడం వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందన్న అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా బీజేపీ పెద్ద పెద్ద స్కెచ్ లు వేస్తున్నట్టు సమాచారం..

2024లో తెలుగు రాష్ట్రాల్లో బలపడాలన్న వ్యూహంలో భాగంగా ఇప్పటికే తెలంగాణలో ఆపరేషన్ మొదలు పెట్టింది. నిజానికి కాంగ్రెస్ టార్గెట్ గా అధికార టీఆర్ఎస్ చేస్తున్న యత్నాలకు ఆ పార్టీ లో ఎమ్మెల్యేలు - నాయకులు లేకుండా పోతున్నారు. కాంగ్రెస్ ను నీరుగార్చడానికి చేస్తున్న ప్రయత్నాలను మరింత ఊపు తెచ్చి ఆ పార్టీ నుంచి నాయకులను లాగే కుట్రకు తెరతీసిందట బీజేపీ అధిష్టానం..

తాజాగా ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. బీజేపీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో నీరుగార్చి ఆ స్థానంలోకి రావడానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం. ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ అయిన మాజీ హోమంత్రి కొడుకును బీజేపీ లాగేయడానికి స్కెచ్ గీసినట్టు సమాచారం. ఇక కరీంనగర్ కు చెందిన సీనియర్ మాజీమంత్రిని కూడా బీజేపీ సంప్రదింపులు జరిగినట్టు సమాచారం.

ప్రస్తుతానికి ఈ ఇద్దరిని టార్గెట్ చేసి బీజేపీ ఆపరేషన్ కాంగ్రెస్ ను చేపట్టబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే డీకే అరుణ సహా టీఆర్ ఎస్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని చేర్చుకున్న బీజేపీ అధిష్టానం ఇప్పుడు కాంగ్రెస్ టార్గెట్ గా తెలంగాణలో ముందుకెళ్తుండడం గమనార్హం.