Begin typing your search above and press return to search.

ఇంటర్నెట్ మోజులో పడి చెడిపోతున్న టీన్స్​..!

By:  Tupaki Desk   |   4 March 2021 1:30 AM GMT
ఇంటర్నెట్  మోజులో పడి చెడిపోతున్న టీన్స్​..!
X
ఇటీవల చిన్నపిల్లల్లో ఇంటర్నెట్​ వాడకం పెరిగిపోయింది. ప్రతి ఇంట్లోనూ స్మార్ట్​ ఫోన్​ అందుబాటులో ఉండటంతో పిల్లలు ఎక్కువగా ఫోన్​, ల్యాప్​టాప్​ను వాడుతున్నారు. అయితే కరోనా ప్రభావం మొదలయ్యాక ఇంటర్నెట్​ వాడకం మరింత పెరిగింది. అన్ని స్కూళ్లు ఆన్​లైన్​లోనే పాఠాలు చెబుతుండటంతో తల్లిదండ్రులు పిల్లలకు మొబైల్​ ఫోన్స్​, ల్యాప్​టాప్స్​ కొనిచ్చారు. ఉన్నతవర్గాల వాళ్లు మాత్రమే కాక.. పేదలు, మధ్యతరగతి ప్రజలు కూడా పిల్లలకు ఫోన్లు, ల్యాప్​టాప్స్​ కొనిచ్చారు. ఇది ఎంతో ప్రమాదం అని అంటున్నారు నిపుణులు..

చిన్నపిల్లలకు ముఖ్యంగా టీనేజ్​ పిల్లలు అతిగా ఫోన్​, ఇంటర్నెట్​ వాడితో వాళ్ల ఆరోగ్యం చెడిపోతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వాళ్లు మానసికంగా కూడా ఎన్నో అవస్థలు పడతారని చెబుతున్నారు. ముఖ్యంగా కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. టీనేజ్​ పిల్లల ఇంటర్నెట్​ వాడకంపై ఇటీవల యూనివర్సిటీ ఆఫ్‌ హెల్సింకీ అధ్యయనం చేసింది.. ఈ అధ్యయనంలో షాకింగ్​ నిజాలు వెలుగుచూశాయి. కౌమరదశ పిల్లలు.. ముఖ్యంగా పదహారేళ్ల వయసున్నవారు ఇంటర్నెట్‌కు బానిలలవుతున్నారని ఆ సర్వేలో తేలింది. ఇంటర్నెట్​ అతిగా వాడటం వల్ల పిల్లలో ఒంటరితనం పెరుగుతుందని.. డిప్రెషన్​ కూడా వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

16, 17, 18 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయిలు, అబ్బాయిల ఇంటర్నెట్‌ వినియోగంపై అధ్యయనం చేశారు. అయితే పిల్లలు ఆన్​లైన్​ క్లాసులతో పాటు సోషల్ ​మీడియా, ఆన్​ లైన్​ గేమ్స్​ కు బానిసలవుతున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. ఇది ఎంతో ప్రమాదమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. చిన్నవయసులోనే సోషల్​మీడియాకు బానిసలు కావడం వల్ల మానవసంబంధాలు దెబ్బతింటాయని.. డిప్రెషన్​ వస్తుందని వాళ్లు హెచ్చరిస్తున్నారు. కాబట్టి పిల్లలను ఓ కంట కనిపెట్టాలని సూచిస్తున్నారు నిపుణులు .