Begin typing your search above and press return to search.

రాజమండ్రి టీడీపీ టికెట్ వీరికే..

By:  Tupaki Desk   |   17 March 2019 9:10 AM GMT
రాజమండ్రి టీడీపీ టికెట్ వీరికే..
X
అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు మళ్లీ సిట్టింగ్ ఎంపీ మురళీ మోహన్ కుటుంబానికే రాజమండ్రి ఎంపీ టికెట్ కట్టబెట్టినట్లు సమాచారం. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు మురళీ మోహన్ కోడలు మాగంటి రూపకు రాజమండ్రి ఎంపీ టికెట్ ఖాయం చేశారని తెలియడంతో అక్కడ టికెట్ ఆశిస్తున్నా గుడా చైర్మన్ గన్ని కృష్ణా, మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కరరామారావులు అసమ్మతి రాజేస్తున్నారు. వీరిని బుజ్జగించేందుకు టీడీపీ రంగంలోకి దిగింది. బొడ్డు భాస్కరరామారావు పార్టీ మారే ఆలోచనలో భాగంగా అనుచరులతో సమావేశమయ్యారు.

గన్నీ కృష్ణను ఇప్పటికే టీడీపీ నేతలు బుజ్జగించినట్లు తెలిసింది. తన అనుయాయులతో గన్నికృష్ణ సమావేశమయ్యారు. నామినేషన్ వేయడానికి ఒకరోజే మిగిలి ఉండడంతో అధిష్టానం త్వరగా తీసుకొని అధికారికంగా అభ్యర్థిని ప్రకటిస్తే ఈ భేధాబిప్రాయాలు ఉండవని పార్టీ వర్గాలు కోరుతున్నాయి.

మురళీ మోహన్ ఎంపీగా ఉన్న సమయంలో మాగంటి రూప పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆమె దాదాపు నాయకులు, ప్రజలకు చిరపరిచితురాలు. మురళీ మోహన్ పోటీచేస్తే ఈ అసమ్మతి నెలకొని ఉండేది కాదు.. కానీ ఆయన కోడలు బరిలో ఉండేసరికి అసమ్మతి అంటుకుంది.