Begin typing your search above and press return to search.

ఆమెను టార్గెట్ చేస్తున్నారు....?

By:  Tupaki Desk   |   17 Feb 2022 12:30 PM GMT
ఆమెను టార్గెట్ చేస్తున్నారు....?
X
రాజకీయాల్లో విమర్శలు సహజం. ఎవరు ఎవరిని అయినా అనవచ్చు. ఒకపుడు అయితే సిద్ధాంతాలు ఉండేవి. దాని ప్రకారమే విమర్శలు కూడా ఉండేవి. ఇక వాటిని సరిచేసుకునే సంస్కారం కూడా అవతల వారికి ఉండేది. ఇక గత కొన్నేళ్ళుగా విమర్శలు హద్దులు దాటుతున్నాయి. అవి ఏకంగా వ్యక్తిగతంగా మారిపోతున్నాయి. అవి కూడా ఇపుడు దాటేసి ఫ్యామిలీస్ మీద కూడా వచ్చేస్తున్నాయి.

తాజాగా ఏపీలో చూస్తే వైసీపీ అధినేతగా జగన్ని టార్గెట్ చేస్తూనే ఆయన సతీమణి భారతి మీద కూడా టీడీపీ నేతలు బాణాలు వేస్తున్నారు.

ఆమెను కూడా వివాదాల్లోకి తెస్తున్నారు. లేటెస్ట్ గా జరిగిన ఒక డిబేట్ లో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అయితే ఒక హాట్ కామెంట్ చేశారు. జగన్ తీసుకునే అనేక నిర్ణయాలలో ఆయన సతీమణి భారతి ప్రమేయం ఉండొచ్చన్న అనుమానాలను సైతం ఆయన వ్యక్తం చేశారు.

మరి అది ఎంతవరకూ నిజమో, టీడీపీ నేతలు ఏ విధమైన సమాచారం ఉందో తెలియదు కానీ పట్టాభి మాత్రం జగన్ కి ఆయన కుటుంబ సభ్యులకు మధ్య అంతరాలు పెరగడానికి కూడా సతీమణి కూడా ఒక కారణం అన్నట్లుగా మాట్లాడారు. ఇపుడు చూస్తే తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా భారతినే టార్గెట్ చేశారు. జగన్ భారతికి తోటి ఆడపడుచులు అత్తగారు ఉసురు తగులుతుంది అని శాపనార్ధాలే ఆమె పెడుతున్నారు.

మరో వైపు చూస్తే భారతి జగన్ తో జాగ్రత్తగా ఉండాలని, ఆయన అవినీతి సంపాదనకు యజమానురాలిగా ఉన్న భారతి కోర్టు బోనులో నిలబడే పరిస్థితి వస్తోంది అని కూడా అన్నారు. ఇక జగన్ తన సొంత చెల్లెళ్ళలనే మోసం చేశారని, ఏపీలోని ఆడపడుచులకు కూడా హామీ ఇచ్చి మోసం చేశారని కూడా అనిత విమర్శించారు.

అలాంటి జగన్ తో సతీమణి భారతి జాగ్రత్తగా ఉండాలని సెటైర్లు కూడా వేశారు. మరి ఇన్నాళ్ళూ లేని విధంగా భారతి ప్రస్తావనను సడెన్ గా ముందుకు తెచ్చి టీడీపీ కామెంట్స్ చేయడం వెనక రాజకీయం మతలబు ఏంటి అన్నదే ఇపుడు చర్చగా ఉంది.