Begin typing your search above and press return to search.

చెవిరెడ్డిని చంపేస్తారా ఏంటి.?

By:  Tupaki Desk   |   3 Feb 2019 12:36 PM GMT
చెవిరెడ్డిని చంపేస్తారా ఏంటి.?
X
వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో ఆయన స్పృహ తప్పి పడిపోవడంలో పోలీసులు వెంటనే ఆయన్ను రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డి ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. మరోవైపు… టీడీపీ కార్యకర్తల దుశ్చర్యపై వైసీపీ శ్రేణులు ఆందోళన చేశాయి. టీడీపీ కార్యకర్తల దాడిని ఖండిస్తూ.. రోడ్డుపై బైఠాయించాయి. సీఎం డౌన్‌ డౌన్‌, పోలీసుల జులుం నశించాలి అంటూ నినాదాలు చేశాయి. దీంతో వేదాంతపురం అగ్రహారంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

వివరాల్లోకి వెళ్తే.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పసుపు-కుంకుమ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేగా పాల్గొనేందుకు వేదాంతపురం అగ్రహారానికి వచ్చారు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి. అయితే. చెవిరెడ్డి భాస్కరరెడ్డి అక్కడికి రావడం ఇష్టంలేని టీడీపీ నాయకులు, స్థానిక కార్యకర్తలు.. అడుగడుగునా ఆటంకాలు కలుగచేశారు. ఇక సభలో భాస్కరరెడ్డి మాట్లాడుతుండగా పలువురు టీడీపీ కార్యకర్తలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. దీంతో.. ఆయన అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. చెవిరెడ్డి భాస్కరరెడ్డిని రుయా ఆస్పత్రికి తరలించారు.