Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: వైసీపీ ఎంపీపై టీడీపీ దాడికి యత్నం

By:  Tupaki Desk   |   2 Feb 2020 11:20 AM GMT
బ్రేకింగ్: వైసీపీ ఎంపీపై టీడీపీ దాడికి యత్నం
X
వైసీపీ చెందిన దళిత ఎంపీ నందిగం సురేష్ దాడికి టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించడం కలకలం రేపింది. జై అమరావతి అనాలంటూ ఆయనను టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టి దాదాపు దాడికి యత్నించారు.

టీడీపీ ఎంపీ విజయవాడలో పర్యటించగా.. టీడీపీ సోషల్ మీడియా ప్రతినిధి అజయ్ చౌదరి - మరికొందరు టీడీపీ కార్యకర్తలు ఆయన కారును అడ్డుకొని చుట్టు ముట్టి ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. జై అమరావతి అనాలని కోరారు. కానీ ఎంపీ అనకపోవడంతో దాడికి యత్నించారు.

ఎంపీ నందిగామలో ఓ వైద్యుడిని కలిసేందుకు వెళుతుండగా టీడీపీ కార్యకర్తలు దళిత ఎంపీపై పడి నానా రచ్చ చేశారు. ఎలాగోలా అక్కడి నుంచి ఎంపీ తప్పించుకోవడంతో పెద్ద ఉపద్రవం తప్పినట్టైంది.