Begin typing your search above and press return to search.

ఇండియాలో తబ్లిగి జమాత్ ప్రభావం ఎంత?

By:  Tupaki Desk   |   6 April 2020 8:30 PM GMT
ఇండియాలో తబ్లిగి జమాత్ ప్రభావం ఎంత?
X
ఆరిపోతున్న కరోనా దీపానికి ఆజ్యం పోసిన సంస్థ తబ్లిగి జమాత్. ప్రపంచంలో ఉన్న వాతావరణాన్ని పట్టించుకోకుండా అంతర్జాతీయంగా అనేక దేశాల నుంచి అతిథులను ఆహ్వానించి దేశంలో కరోనా విలయతాండవానికి తబ్లిగి జమాత్ రాగం తాళం వేసింది. మార్చి 29 తర్వాత దేశంలో నమోదైన అత్యధిక కేసులు తబ్లిగి జమాత్ వే. ప్రస్తుతం దేశంలో నమోదయిన కేసుల్లో తబ్లిగి జమాత్ కేసుల వాటా 40 శాతంగా ఉంది. వీరి సమావేశానికి హాజరైన ముస్లింలు వారు బంధుమిత్రులకు ఎంత మందికి అంటించారో తెలియని అయోమయ పరిస్థితి. పోనీ ప్రభుత్వం పిలుపు ఇచ్చిన తర్వాత అయినా వీరు బయటకు వచ్చారా అంటే అదీ లేదు. చాలామంది ప్రభుత్వానికి దొరక్కుండా పరీక్షలు చేయించుకోకుండా దాక్కుంటారు. ఎందుకు వారు ఇలా చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి.

ప్రస్తుతం దేశంలో 4067 కేసులు నమోదు కాగా... వీటలో 1445 కేసులు కేవలం తబ్లిగి జమాత్ వల్ల సోకినవే. గత 24 గంటల్లోనే సుమారు 700 కొత్త కేసులు వచ్చాయి. మార్చి 29 తర్వాత తేలిన కేసుల్లో అత్యధికం ఇవే కేసులు. ఇక మరణాల రేటు కూడా భారీగా పెరుగుతోంది. సోకిన వారిలో 74 శాతం మంది మగవాళ్లే. మృతుల్లో కూడా వారి వాటా అంతే ఉంది.

ఇప్పటివరకు నమోదైన మొత్తం మరణాలు 109 కాగా కరోనా. అయితే... 63 శాతం మృతులు 60 ఏళ్ల పైన ఉన్న వారివి కాగా 30 శాతం కేసులు 40-60 ఏళ్ల మధ్యవారివి. మృతుల్లో 40 ఏళ్ల లోపు వారు కేవలం 7 శాతం మంది మాత్రమే ఉన్నారు. మరణాలు రేటు వృద్ధుల్లో ఎక్కువగా ఉన్నా... ఈ వ్యాధి మాత్రం ఎవరికైనా సులువుగా సోకుతుంది. యువతకు రాదు అనుకోవడం తప్పు. ఇదిలా ఉండగా... ఈ తబ్లిగి జమాత్ సభ్యులు పలు చోట్ల డాక్టర్ల మీద దాడి చేయడం - ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడం చేస్తున్నారు. దీంతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం దీనిపై ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. ఎవరి మీదయినా కరోనా పాజిటివ్ వ్యక్తి ఉమ్మితే... అతని మీద హత్యాయత్నం కేసు పెడతారు. ఒకవేళ ఉమ్మడం వల్ల కరోనా సోకిన వ్యక్తి చనిపోతే ఆ కేసును మర్డర్ కేసుగా మార్చి దానికనుగుణంగా శిక్షలు నిర్ణయిస్తారు.