Begin typing your search above and press return to search.

బాబును ఢీకొట్టేందుకు రెడీ అవుతున్న స్వామీజీ

By:  Tupaki Desk   |   4 Nov 2016 7:49 AM GMT
బాబును ఢీకొట్టేందుకు రెడీ అవుతున్న స్వామీజీ
X
చంద్రబాబు పేరు చెబితే చాలు విరుచుకుపడే విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మరోసారి తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ఆలయ భూముల విషయంలో చంద్రబాబు ప్రభుత్వ అక్రమాలకు వ్యతిరేకంగా కదం తొక్కడానికి సిద్దమవుతున్నట్లు తెలిపారు. ఆలయ భూముల పరిరక్షణకు పోరాటం తీవ్రం చేస్తానని ఆయన ప్రకటించారు.

విజయవాడలో 40 దేవాలయాలను కూలగొట్టిన దుర్మార్గపు ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ అండ ఉండబట్టే కొందరు వ్యక్తులు దేవాలయాల భూములను దోచుకుంటున్నారని ఆవేదన చెందారు. ఆలయ భూములను రక్షించడం కోసం శారదాపీఠం పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు. తన జన్మదిన వేడుకలు సందర్భంగా ఆయన విశాఖలో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై సీరియస్ అయ్యారు.

తిరుమల ఆలయ సంపదను కాల్వలు - రోడ్ల నిర్మాణానికి వినియోగించే కుట్ర చేస్తున్నారని ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. ప్రభుత్వం హిందూ మతాన్ని - హిందూ జాతిని దుర్మార్గంగా అణచివేస్తోందన్నారు. ప్రభుత్వం చేతుల్లో నలిగిపోతున్న ధర్మాన్ని కాపాడేందుకు పోరాడాలన్నారు. కాగా స్వామిజీ తన జన్మదిన కార్యక్రమం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/