Begin typing your search above and press return to search.

పెగాసస్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు

By:  Tupaki Desk   |   1 Aug 2021 12:33 PM GMT
పెగాసస్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు
X
దేశాన్ని కుదిపేస్తున్న 'పెగాసస్' వివాదాన్ని సుప్రీంకోర్టు టేకప్ చేసింది. రాజకీయ రచ్చకు కారణం అవుతోన్న పెగాసస్ అంశంపై విచారణకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. పెగాసస్ పిటీషన్లపై వచ్చే గురువారం విచారణ చేయనుంది. సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం ముందు ఈ విచారణ జరుగనుంది.

ఇప్పటికే ఈ అంశంపై సుప్రీంకోర్టులో మూడు పిటీషన్లు దాఖలయ్యాయి. ప్రత్యేక దర్యాప్తును కోరుతూ ఎన్.రామ్, శశికుమార్ పిటీషన్ వేయగా న్యాయవాది ఎంఎల్ శర్మ మరొక పిటీషన్ దాఖలు చేశారు.

ఇక సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్ మరో పిటీషన్ వేశారు. కాగా పెగాసస్ స్కామ్ పై ప్రత్యేక దర్యాప్తును కోరుతూ వేసిన పిటీషన్లపై వీలైతే వచ్చే వారం విచారణను చేపడుతామని గత శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సూచించారు.

విపక్ష రాజకీయ నాయకులు, పాత్రికేయులు, ఇతర ప్రముఖులు లక్ష్యంగా ఇజ్రాయెల్ స్పైవేర్ ను ఉపయోగించి వారి ఫోన్ల సంభాషణలపై నిఘా పెట్టారని వచ్చిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జి లేదా మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని పిటీషన్ దాఖలు చేసిన ప్రముఖ పాత్రికేయులు ఎస్ రామ్ , శశికుమార్ సత్వరమే జరపాలని గత శుక్రవారం వాదనలు చేస్తూ కోరారు.

పరిగణలోకి తీసుకొని వచ్చేవారం విచారణ జాబితాలో చేరుస్తామని గత శుక్రవారం సూచించింది. పెగాసస్ పై అన్ని పిటీషన్లను వచ్చే గురువారం విచారణ జాబితాలో చేరుస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నిర్ణయం తీసుకున్నారు. స్వేచ్ఛ, స్వాతంత్య్రాలపై తీవ్ర ప్రభావం చూపే ఇలాంటి అంశంపై సత్వరమే విచారణ జరపాలని న్యాయవాది కపిల్ సిబాల్ కోరారు.

పెగాసస్ అనే ఇజ్రాయిల్ నిఘా సాఫ్ట్ వేర్ ద్వారా నిఘా పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించిందని అంతర్జాతీయ పత్రికలు సంచలన కథనాలు వెలువరించాయి. రాహుల్ గాంధీతో సహా దేశంలో 142 మందికి పైగానే ప్రముఖులను ఎంపిక చేసుకున్నట్లు ప్రముఖ మీడియా సంస్థల సంయుక్త పరిశోధనలో వెల్లడైనట్టు పిటీషనర్లు పేర్కొన్నారు.