Begin typing your search above and press return to search.

ఆంటీని లొంగదీసుకునేందుకు విద్యార్థి డ్రోన్‌ కెమెరాతో..!

By:  Tupaki Desk   |   17 April 2020 12:30 AM GMT
ఆంటీని లొంగదీసుకునేందుకు విద్యార్థి డ్రోన్‌ కెమెరాతో..!
X
కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ విధించడంతో మహిళలపై అఘాయిత్యాలు.. హత్యలు.. కిడ్నాప్‌ కేసులు తగ్గాయని పోలీసులు సంతోషంగా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో తమిళనాడులోని రామనాధపురం జిల్లా పుదుమఠం ప్రాంతంకు చెందిన శివకుమార్‌ అనే ఇంజనీరింగ్‌ విద్యార్థిపై లైంగిక వేదింపుల కేసు నమోదు అయ్యింది. అతడిపై పోలీసులు నిర్భయ యాక్ట్‌ కింద కూడా కేసు పెట్టారు. అతడు తన పక్కింట్లో ఉండే ఆంటీని లోబర్చుకునేందుకు చేసిన ప్రయత్నం చూసి పోలీసులు కూడా అవాక్కవుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇంజనీరింగ్‌ స్టూడెండ్‌ అయిన శివ కుమార్‌ లాక్‌ డౌన్‌ కారణంగా సొంత ప్రాంతంకు వెళ్లాడు. అక్కడ ఖాళీగా ఉండటంతో పక్కింటి ఆంటీపై మనసు పడ్డాడు. ఆమెను లోబర్చుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. చివరకు ఆమె స్నానం చేస్తుండగా డ్రోన్‌ కెమెరాతో వీడియోను చిత్రీకరించి ఆమె వాట్సప్‌ నెంబర్‌ కు పంపించాడు. తన కోరిక తీర్చకుంటే ఆ వీడియోను పోర్న్‌ సైట్లలో పెడతానంటూ బెదిరించాడు. దాంతో ఆమె ఏం చేయాలో పాలుపోక భర్తకు చెప్పింది. భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

భర్త చేసిన ఫిర్యాదుకు వెంటనే స్పందించిన పోలీసులు శివకుమార్‌ ను అరెస్ట్‌ చేశారు. అతడిని విచారిస్తున్న సమయంలో మరో 50 మంది ఆంటీలను కూడా అతడు ఇదే పద్దతిన వేదించాడని.. పలువురిని లోబర్చుకున్నాడు అని పోలీసుల ఎంక్వౌరీలో తేలింది. అతడిని కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు పోలీసులను డిమాండ్‌ చేస్తున్నారు.