Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేకు కత్తిపోట్లు.. సంచలనంగా మారిన ఉదంతం

By:  Tupaki Desk   |   18 Nov 2019 11:20 AM IST
ఎమ్మెల్యేకు కత్తిపోట్లు.. సంచలనంగా మారిన ఉదంతం
X
కర్ణాటక మాజీ మంత్రి.. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న తన్వీర్ సైత్ పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడికి దిగారు. ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయనపై ఒక్కసారిగా విరుచుకుపడి కత్తులతో దాడి చేశారు. ఈ ఉదంతం తీవ్ర సంచలనంగా మారింది.

ఆదివారం అర్థరాత్రి మైసూర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఎమ్మెల్యే పక్కనున్న భద్రతా సిబ్బంది అలెర్ట్ గా ఉండటంతో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన ఆయన్ను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. వైద్య చికిత్సలు అందిస్తున్నారు.

నరసింహారాజ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తన్వీర్ పేరు గతంలోనూ ఒక అంశంలో పాపులర్ అయ్యింది. అసెంబ్లీలో నీలిచిత్రాలు చూస్తూ వివాదంలో చిక్కుకున్నారు. అప్పట్లో ఆయన మీద పెను దుమారం రేగింది. ఇదిలా ఉంటే.. ఆయనపై దాడి చేసిన వ్యక్తిని ఫర్హన్ పాషాగా గుర్తించారు.

అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఏ కారణంతో ఎమ్మెల్యేపై దాడికి యత్నించారన్న కోణంలో ప్రశ్నిస్తున్నారు. దాడి వెనుక మరేదైనా కారణం ఉందా? అన్న అంశం మీదా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏమైనా ఒక ఎమ్మెల్యే మీద జరిగిన దాడి ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది.