Begin typing your search above and press return to search.

వెయిట్ లాస్ అయిన వారికి స్పెషల్ గిఫ్ట్స్!

By:  Tupaki Desk   |   19 Aug 2021 12:30 AM GMT
వెయిట్ లాస్ అయిన వారికి స్పెషల్ గిఫ్ట్స్!
X
ప్రస్తుతం ప్రతీ ఒక్కరు డిస్కస్ చేసుకునే విషయాల్లో తప్పక ఉండేది ‘కొవిడ్’. ఈ మహమ్మారి వైరస్ వల్ల పరిస్థితులన్నిటిలో గణనీయమైన మార్పులొచ్చాయి. ‘కొవిడ్‌కు ముందర, కొవిడ్ తర్వాత’ అనే సిచ్యువేషన్స్‌ను మనం గమనించొచ్చు. కరోనా వల్ల పని పరిస్థితుల్లో పూర్తిగా మార్పులు రాగా, చాలా మంది కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ క్రమంలో జనాలందరూ కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో బయటకు ఎలాగూ రాలేదు. ఓన్లీ తిని కూర్చోవడం. రెగ్యులర్ లైఫ్ రొటీన్‌కు బ్రేక్ పడింది. ఫలితంగా చాలా మంది ఇట్టే బరువు పెరిగిపోయారు. మరి కొందరికి ఇతర అనారోగ్య సమస్యలు వచ్చాయి.

ఈ కొవిడ్ టైంలో వివిధ పద్ధతుల్లో వెయిట్ లాస్ అయిన వారికి గిఫ్ట్స్ ఇవ్వనున్నట్లు ది నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ సీఈవో హమద్ అల్ మెహియాస్ తెలిపారు. తన ఇన్‌ స్టా గ్రామ్ అకౌంట్‌లో ‘మెహియాస్’ పేరుతో హ్యాష్‌ట్యాగ్ చాలెంజ్ విసిరారు. కొంత వ్యవధిలో ప్రత్యేక పద్దతులను అనుసరించి, బరువు తగ్గిన వారు తాము అనుసరించిన విధానాలను ఈ చాలెంజ్‌లో షేర్ చేయడం ద్వారా యాపిల్ వాచ్, ఫోన్ తదితర గిఫ్ట్స్‌ను అందుకోవచ్చని వివరించారు. అయితే, చాలా మంది కొవిడ్ టైంలో బరువు తగ్గే పని కాకుండా పెరిగే పని చేశారని కొందరు పేర్కొంటున్నారు.

కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో బయటకు వెళ్లే పరిస్థితులు ఎలాగూ లేవు. ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తిని కూర్చున్నారు మెజారిటీ జనాలు. దాంతో ఆటోమేటిక్‌గా అందరూ వెయిట్ దాదాపుగా పెరిగారు. ఇకపోతే హ్యాబిట్స్ అన్ని కూడా డ్రాస్టిక్‌గా చేంజ్ అయ్యాయి. ఓన్లీ ఈటింగ్ అనేది హ్యాబిట్‌గా మారిపోయింది. ఫలితంగా అందరూ వెయిట్ గెయిన్ అయ్యారు. ఈ విషయాలపై పలు అధ్యయనాలు కూడా జరిగాయి. కొవిడ్ మహమ్మారి టైంలో యూఏఈకి చెందిన 31 శాతం మంది జనం వెయిట్ బాగా పెరిగారని ఓ అధ్యయనంలో తేలింది.

ఇకపోతే 39 శాతం మంది శారీర వ్యాయామానికి దూరమై పలు అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నారని స్పష్టమైంది. ఈ క్రమంలోనే కొందరు మాత్రం హెల్త్ పట్ల కాన్షియస్‌నెస్ పలు పద్ధతులు పాటించి వెయిట్ లాస్ అయ్యారు. ఇక బరువు పెరగొద్దని భావిస్తూనే, ఉన్న బరువును కూడా తగ్గించుకునేందుకుగాను పలు పద్ధతులు ఫాలో అయ్యారు. వారు అవలంభించిన పద్ధతుల గురించి తెలిపడం ద్వారా బహుమతులు గెలుచుకోవచ్చు. ఇందుకుగాను వారు ఇన్ స్టా వేదికగా షేర్ అయిన ‘మెహియాస్’ చాలెంజ్ గురించి తెలుసుకోవాలి.

ఆ హ్యాష్‌ట్యాగ్‌తో వారు అనుసరించిన పద్ధతుల గురించి వివరణ ఇస్తే చాలు.. విలువైవన బహుమతులు అనగా యాపిల్ వాచ్, యాపిల్ ఫోన్ తదితరాలు అందజేయనున్నట్లు ది నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ సీఈవో హమద్ అల్ మెహియాస్ ప్రకటించారు. ఇంకెందుకు ఆలస్యం మరి.. మీలో ఎవరైన వెయిట్ లాస్ అయిన వారు ఉంటే ఆ పద్ధతులను సోషల్ మీడియా వేదికగా సదరు హ్యాష్ ట్యాగ్‌తో వివరించండి.. విలువైన వస్తువులను మీ సొంతం చేసుకోండి..