Begin typing your search above and press return to search.

ముందు ఎవరిని బతికించాలో మీరే చెప్పండి ..డాక్టర్లు

By:  Tupaki Desk   |   28 March 2020 3:30 AM GMT
ముందు ఎవరిని బతికించాలో మీరే చెప్పండి ..డాక్టర్లు
X
కరోనా దెబ్బకి ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంది. ప్రపంచంలోని ప్రతి దేశం కూడా కరోనా వైరస్ తో భాదపడుతున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన చైనా కంటే , అమెరికా , ఇటలీ , స్పెయిన్ లోనే కరోనా భాదితులు ఎక్కువగా ఉన్నారు. స్పెయిన్ లో 64,059 మంది కరోనా భాదితులు ఉన్నారు. అలాగే కరోనా వైరస్ వల్ల ఇప్పటివరకు 4,858 మంది మృత్యువాత పడ్డారు. స్పెయిన్ లో కరోనా భీభత్సం సృష్టిస్తుంది.

అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే ..కొంతమంది కరోనా పేషెంట్లు వెయిటింగ్ రూంలలో ఎదురుచూస్తూనే ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని చోట్ల అంత్యక్రియలు పూర్తి చేసేందుకు కూడా చోటు దొరకడం లేదు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో కొత్త రూల్స్ తో హ్యాంగ్ అయిపోతున్నాయి. పాత పేషెంట్లను చికిత్స చేయకముందే కొత్త వాళ్లు వచ్చిపడుతున్నారు. మాడ్రిడ్ లోని ఎమర్జెన్సీ రూంలో ఒక కరోనా పేషెంట్ కు డెత్ సర్టిఫికేట్ ఇస్తూనే మరో వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు వెళ్లాడు డేనియల్ బెర్నబ్యూ.
'ఆ తాత ఏ పరిస్థితుల్లో అయినా, బతికే అవకాశం కనిపించడం లేదు. చాలా మంది చావుతో పోరాడుతున్న వారిని కాపాడాల్సిన బాధ్యత ఉంది. అందుకే ముందెవరికి చికిత్స కావాలో వారే తేల్చుకోవాలి' అని ఆ డాక్టర్ అంటున్నాడు.

స్పెయిన్ కబలిస్తున్నకరోనా యూరప్ మొత్తానికి షాకింగ్ గా మారింది. 47మిలియన్ మంది జనాభా ఉన్న దేశమైనప్పటికీ చైనా కంటే వేగంగా కరోనా ప్రభావానికి గురవుతోంది. ఇటలీ కంటే వేగంగా పాకడంతో స్పెయిన్ కరోనా నుండి కోలుకోలేకుండా పోతుంది. . ప్రధాని పెడ్రో శాంచెజ్ మూడు వారాల ముందే వైరస్ గురించి హెచ్చరికలు జారీ చేశారు. ఆ దేశంలో చాలా మంది ఇటువంటి పరిస్థితులను ఇప్పటివరకూ ఫేస్ చేయలేదు. సివిల్ వార్ గురించి తెలిసిన వాళ్లు మాత్రమే అప్పటి పరిస్థితులు గుర్తు చేసుకుంటున్నారు. అప్పటి కంటే గడ్డు పరిస్థితులు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ప్రతి డిపార్ట్‌మెంట్లోనూ వ్యాధి లక్షణాలున్న వాళ్లు కనిపించడం తో అంతా లాక్ డౌన్ ప్రకటించేశారు. ఎమర్జెన్సీ అయినప్పటికీ కూడా ..పూర్తి స్థాయి సేఫ్టీతోనే బయటకి రావాలని ప్రధాని తెలిపారు.