Begin typing your search above and press return to search.

ములుగులో షాకింగ్ సీన్.. ఎస్ఐను కాల్చేసిన కానిస్టేబుల్

By:  Tupaki Desk   |   26 Dec 2021 2:30 PM GMT
ములుగులో షాకింగ్ సీన్.. ఎస్ఐను కాల్చేసిన కానిస్టేబుల్
X
అరుదైన పరిణామం చోటు చేసుకుంది. తనపై అధికారితో జరిగిన వాగ్వివాదం అంతకంతకూ ముదరటమే కాదు.. విచక్షణ కోల్పోయి.. ఆగ్రహంతో కూడిన ఆవేశంతో ఎస్ఐను కాల్చేశాడు కానిస్టేబుల్. ఈ ఉదంతంలో ఎస్ఐ అక్కడికక్కడే మరణించగా.. తాను చేసిన పనితో ఆందోళనకు గురైన సదరు కానిస్టేబుల్ తనను తాను కాల్చుకున్నాడు. తీవ్ర గాయాల బారిన పడిన అతడ్ని వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.తెలంగాణలోని ములుగు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం గురించి తెలిసినంతనే నోట మాట రాని పరిస్థితి.

జిల్లాలోని వెంకటాపురం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. 39వ బెటాలియన్ కు చెందిన ఎస్ఐ ఉమేశ్ చంద్రపై కానిస్టేబుల్ స్టీఫెన్ రెండు రౌండ్ల మేర కాల్పులు జరిపారు. దీంతో సదరు ఎస్ఐ అక్కడికక్కడే అసువులు బాశారు. దీంతో ఆందోళనకు గురైన వ్యక్తి తనను తాను కాల్చేసుకున్నాడు. విచిత్రమైన విషయం ఏమంటే.. ఎస్ఐది బిహార్ ది అయితే.. కాల్పులు జరిపిన వ్యక్తిది కన్యాకుమారిగా చెబుతున్నారు.

సెంట్రీ డ్యూటీ ఎప్పుడూ తనకే ఇస్తారంటూ ఎస్ఐ ఉమశ్ చంద్రకు.. కానిస్టేబుల్ పిర్యాదు చేయటం.. ఈ సందర్భంగా ఈ ఇద్దరి మధ్యా వాదన చోటు చేసుకోవటం గమనార్హం. అది కాస్తా గొడవలుగా మారటం.. ఆగ్రహానికి గురైన కానిస్టేబుల్ తన పై అధికారి అన్నది చూకుండా మాట్లాడిన దానికి ఇప్పుడు సంచలనంగా మారింది. ఎంత చెప్పినా.. రోజూ ఒకే వ్యక్తికి సెంట్రీ ఉద్యోగం ఇవ్వటం దేనికి నిదర్శమని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. తాజాగా తెలంగాణ - చత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని వెంకటాపుర పోలీస్ స్టేషన్ వద్ద కానిస్టేబుల్ సతీశ్ కొంతకాలంగా పని చేస్తున్నారు. ఎప్పుడూ లేని రీతిలో ఎస్ఐపై కాల్పులు జరపటం.. బాధతో తనను తాను కాల్చుకోవటం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.