Begin typing your search above and press return to search.

ఢిల్లీ మెట్రో జర్నీలో యువతికి షాకింగ్ ఘటన.. జిప్ తీసి అలా చేశాడట

By:  Tupaki Desk   |   14 Feb 2020 5:15 AM GMT
ఢిల్లీ మెట్రో జర్నీలో యువతికి షాకింగ్ ఘటన.. జిప్ తీసి అలా చేశాడట
X
ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న వేళ తనకు ఎదురైన ఒక దారుణ ఘటన గురించి ఒక యువతి చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో ఆమె మెట్రోలో ప్రయాణిస్తున్నారు. సదరు యువతి పోస్టు చేసిన ఫోటోలో గ్రే కలర్ జాకెట్ వేసుకొని ముందు వైపు బ్యాగ్ తగిలించిన యువకుడు చేసిన దారుణ చేష్ట గురించి ఆమె వివరంగా వెల్లడించింది.

‘ఆఫీసు నుంచి వస్తూ మెట్రోలోని ఏడో కోచ్ లోకి ఎక్కా. రెండో సీటు వద్ద కూర్చున్నా. ఆ వ్యక్తి నా ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. తీరా చూస్తే.. అతడి ఫ్యాంట్ జిప్ తీసి ఉంచాడు. మర్మాంగాన్ని నా వైపు చూపించాడు. తన ప్రైవేట్ పార్ట్ ను బయట కు తీసి.. మిగిలిన వారికి కనిపించకుండా ఉండేందుకు వీలుగా తన బ్యాగ్ తో కవర్ చేశాడు’ అని బాధిత యువతి ట్వీట్ లో వివరంగా పేర్కొన్నారు. గురుగ్రామ్ వెళుతున్న వేళ లో తనకీ దారుణ అనుభవం ఎదురైనట్లు పేర్కొన్నారు. అప్పుడు సమయం సాయంత్రం ఆరు గంటలని ఆమె చెప్పారు.

ఆ ఘటన జరిగిన వెంటనే ఏం చేయాలో తనకు అర్థం కాలేదని.. కాసేపటికి అతను డోర్ వద్దకు వెళ్లి నిలబడ్డాడని.. అతడి ఫోటో తాను తీసుకునే సమయం లో సాయంత్రం 6.11 గంటలని.. సుల్తాన్ పూర్ వాటర్ ప్లాంట్ అని ఉందని.. ఆ తర్వాత అతడు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పేర్కొంది.

అతను ఏ స్టేషన్లో దిగాడో కూడా తాను చూడ లేదని.. నేను కళ్లను నేల మీదకే పెట్టి కూర్చున్నానని.. తనకేం చేయాలో కూడా తోచలేదన్నారు. తర్వాత తన స్నేహితురాలికి ఫోన్ చేసి విషయం చెబితే.. నలుగురికి చెప్పి అప్పుడే నాలుగు దెబ్బలు వేయాల్సిందని చెప్పిందని చెప్పారు. వెంటనే ఫిర్యాదు చేయాలన్న ఆమె మాటలతో తానీ ట్వీట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఆమె చేసిన ట్వీట్ కు ఢిల్లీ మెట్రో స్పందించింది. అలాంటి ఘటనలు ఎదురైతే 155370 కానీ 155655 నెంబర్ల కు ఫోన్ చేయాలని పేర్కొంది. అలా చేస్తే.. సమీపంలోని మెట్రో స్టేషన్ అధికారులు చర్యలు తీసుకుంటారని పేర్కొంది.