Begin typing your search above and press return to search.

నెల్లూరు జిల్లాలో ఆరాచకం.. ప్రేమ పెళ్లి చేసుకుందని వెంటాడి మరి నోట్లో విషం పోశారు

By:  Tupaki Desk   |   10 March 2021 1:30 PM GMT
నెల్లూరు జిల్లాలో ఆరాచకం.. ప్రేమ పెళ్లి చేసుకుందని వెంటాడి మరి నోట్లో విషం పోశారు
X
నచ్చినోళ్లను పెళ్లి చేసుకోవటమే పాపమైంది. తమను కాదని ప్రేమ పెళ్లి చేసుకుందన్న కోపంతో కూతురుపై దారుణరీతిలో వ్యవహరించిన తల్లిదండ్రుల ఉదంతంగా దీన్ని చెప్పాలి. నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం సంచలనంగా మారటమే కాదు.. మరీ ఇంత దారుణమా? అని మండిపడుతున్నారు. నెల్లూరు జిల్లా సీతాపురం మండలం సింగారెడ్డి పల్లికి చెందిన బాలక్రిష్ణ.. దేవమ్మ చెరువుకు చెందిన అనితలు ప్రేమించుకున్నారు. పెద్దలకు ఇష్టం లేకుండా కర్నూలు జిల్లాలోని అహోబిలం వద్ద రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి గురించి తెలిసిన అనిత తల్లిదండ్రులు తమ అమ్మాయిని కిడ్నాప్ చేశారని కేసు పెట్టారు. అయితే.. తాము మేజర్లమని.. ఇష్టంతోనే తాను పెళ్లి చేసుకున్నట్లుగా అనిత చెప్పింది. దీంతో ఇరు వర్గాల వారిని పిలిపించిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. తహశీల్దార్ వెంకట సునీల్ ఎదుట పిలిచి నచ్చజెప్పారు. అనంతరం నవ దంపతులు ఆటోలో తమ ఇంటికి బయలుదేరారు. ఆ ఆటోను కారులో వెంబడించిన అనిత తల్లిదండ్రులు.. బంధువులు సంగసానిపల్లె గ్రామ సమీపంలో ఆటోను అడ్డుకున్నారు.

కొత్త జంటను కిందకు దించి దాడి చేయటమ కాదు.. తమ పరువు తీసిందంటూ అనిత నోట్లో పురుగుల మందు పోశారు. దీంతో బాలక్రిష్ణ పోలీసులకు ఫోన్ చేశారు. అనితను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఎంత ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే మాత్రం మరీ ఇంతలా దాడి చేస్తారా? అని మండిపడుతున్నారు.