Begin typing your search above and press return to search.
షాకింగ్: షాపులు ఖాళీ చేయిస్తున్న మహిళా ఏసీపీ చేతివేళ్ల నరికివేత
By: Tupaki Desk | 1 Sep 2021 3:56 AM GMTవిన్నంతనే ఉలిక్కిపడే ఉదంతం చోటు చేసుకుంది. రోడ్లను అక్రమించుకొని అక్రమంగా ఏర్పాటు చేసిన వ్యాపారాల్ని ఖాళీ చేసేందుకు వెళ్లిన పోలీసు అధికారిణికి ఊహించనిరీతిలో దాడికి గురయ్యారు. ఫుట్ పాత్ మీద అక్రమ దుకాణాల్ని ఏర్పాటు చేసిన వారిలో ఒక వ్యాపారి చేసిన దారుణం షాకింగ్ గా మారింది. ఇందుకు మహారాష్ట్రలోని ఠాణె వేదికగా మారింది. రోడ్లు.. ఫుట్ పాత్ లను అక్రమించుకొని అక్రమంగా దుకాణాల్నిఏర్పాటు చేసుకున్న వీధి వ్యాపారులపై ఠాణె మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది.
మున్సిపల్ కమిషనర్ డాక్టర్ విపిన్ శర్మ ఆదేశాలతో దుకాణాలు.. తోపుడు బండ్లను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. అధికారులు అక్కడ చేరుకోగానే అక్కడ ఘర్షణ ఏర్పడింది. ఇంతకాలంగా వ్యాపారాలు చేసుకుంటున్న తమను ఉన్నపళంగా ఖాళీ చేయమంటారా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. అమర్జీత్ యాదవ్ అనే కూరగాయల వ్యాపారి కత్తితో మహిళా ఏసీపీ కల్పితా పింపుల్ పై దాడి చేశారు. ఈ ఉదంతంలో ఆమె చేతి వేళ్లు మూడు తెగిపడ్డాయి. తలకు సైతం గాయమైంది.
దీంతో.. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమె సెక్యూరిటీ గార్డుకు కూడా తీవ్రంగా గాయాలు అయ్యాయి. దాడికి పాల్పడిన కూరగాయల వ్యాపారిపైన దాడి కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. హత్యాయత్నం.. ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించిన తీరుపై కేసును నమోదు చేసినట్లుగా డిప్యూటీ కమిషనర్ వినయ్ పేర్కొన్నారు. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. మహిళా పోలీసు అధికారిపైనే దాడికి తెగబడిన వైనం ఉలిక్కిపడేలా చేసింది.
మున్సిపల్ కమిషనర్ డాక్టర్ విపిన్ శర్మ ఆదేశాలతో దుకాణాలు.. తోపుడు బండ్లను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. అధికారులు అక్కడ చేరుకోగానే అక్కడ ఘర్షణ ఏర్పడింది. ఇంతకాలంగా వ్యాపారాలు చేసుకుంటున్న తమను ఉన్నపళంగా ఖాళీ చేయమంటారా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. అమర్జీత్ యాదవ్ అనే కూరగాయల వ్యాపారి కత్తితో మహిళా ఏసీపీ కల్పితా పింపుల్ పై దాడి చేశారు. ఈ ఉదంతంలో ఆమె చేతి వేళ్లు మూడు తెగిపడ్డాయి. తలకు సైతం గాయమైంది.
దీంతో.. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమె సెక్యూరిటీ గార్డుకు కూడా తీవ్రంగా గాయాలు అయ్యాయి. దాడికి పాల్పడిన కూరగాయల వ్యాపారిపైన దాడి కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. హత్యాయత్నం.. ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించిన తీరుపై కేసును నమోదు చేసినట్లుగా డిప్యూటీ కమిషనర్ వినయ్ పేర్కొన్నారు. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. మహిళా పోలీసు అధికారిపైనే దాడికి తెగబడిన వైనం ఉలిక్కిపడేలా చేసింది.