Begin typing your search above and press return to search.

ఇండియా పాక్ కొట్లాట నాకెందుకు: షోయాబ్ మాలిక్

By:  Tupaki Desk   |   22 Jun 2020 1:30 AM GMT
ఇండియా పాక్ కొట్లాట నాకెందుకు: షోయాబ్ మాలిక్
X
భారత్-పాకిస్తాన్ లు శత్రుదేశాలు.. ఎప్పుడూ సరిహద్దుల్లో రగులుతూనే ఉంటుంది. ఇరు దేశస్థులు శత్రువులుగానే చూస్తుంటారు. భారత్-పాక్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు అయితే ఆ ఉత్కంఠ ఊపేస్తుంది. భావోద్వేగాలు ఓ రేంజ్ లో ఉంటాయి.

ఇప్పటికీ పాకిస్తాన్ అన్నా ఆ దేశస్థులు అన్నా భారతీయులకు పడదు. అలాగే మనవాళ్లు అన్నా పాకిస్తానీలు ఏకంగా యుద్ధానికి రెడీ అంటారు. అలాంటి రెండు దేశాల మధ్య బంధం బలపడింది. ఇద్దరు క్రీడాకారులు పెళ్లి చేసుకున్నారు. వారే పాకిస్తాన్ క్రికెటర్ షోయాబ్ మాలిక్.. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. ఇప్పుడు ఒక బిడ్డను కూడా కన్నారు.

రెండు శత్రుదేశాలకు చెందిన వారైనా వీరి మధ్య అన్యోన్యం ఉంది. ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఇంతటి ఉద్రిక్తతల మేళ ఎలా అనిపిస్తోందని పాకిస్తాన్ క్రికెటర్ షోయాబ్ మాలిక్ ను ప్రశ్నించగా అతడు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు వారు ఎక్కడి నుంచి వచ్చారు.? ఏ దేశం అనే విషయాలను పట్టించుకోకూడదని షోయాబ్ మాలిక్ వ్యాఖ్యానించాడు. అలాంటి విషయాలు పట్టించుకోవద్దని హితవు పలికారు.

ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి బాధ పడడానికి తాను రాజకీయ నాయకుడిని కాదని షోయబ్ మాలిక్ స్పష్టం చేశారు. మా బంధాన్ని రెండు దేశాల మధ్యనున్న వైరం విడదీయదని తెలిపారు.