Begin typing your search above and press return to search.

పాకిస్థాన్​ పరువు పోయింది.. సీనియర్​ క్రికెటర్​ సంచలన ఆరోపణలు..!

By:  Tupaki Desk   |   6 March 2021 4:30 AM GMT
పాకిస్థాన్​ పరువు పోయింది.. సీనియర్​ క్రికెటర్​ సంచలన ఆరోపణలు..!
X
పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డుపై.. ఆ దేశ మాజీ క్రికెటర్​ షోయబ్​ అక్తర్​ సంచలన ఆరోపణలు చేశారు. ఆటగాళ్ల ఆరోగ్యం విషయంలో పీఎస్​బీ పెద్దలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వాళ్ల నిర్లక్ష్యం వల్లే ఆటగాళ్లకు కరోనా సోకిందని విమర్శించారు. మిగతా దేశాల క్రికెట్​ బోర్డులతో పోలిస్తే పీఎస్​బీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అక్తర్ ఫైర్​ అయ్యారు. ఆటగాళ్లకు కరోనా సోకడంతో పీఎస్​ఎల్​ ( పాకిస్థాన్​ సూపర్​ లీగ్​) వాయిదా పడింది. ఇందుకు కారణం పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డేనని అక్తర్​ మండిపడ్డారు.

పీఎస్​ఎస్​ లో ఆడుతున్న ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహించడంతో ఆరుగురికి కరోనా సోకింది. దీంతో వెంటనే టోర్నీని రద్దు చేశారు. ఈ విషయంపై షోయబ్​ అక్తర్​ తన యూట్యూబ్​ చానల్ ​లో మాట్లాడారు. ‘బయోసెక్యూర్​ పరిస్థితులను కల్పించడంలో పీఎస్​బీ పూర్తిగా విఫలమైంది. సరిపడా మెడికల్ సిబ్బంది లేరు. దీనికి పీసీబీ సీఈవో వసీమ్​ ఖాన్​ బాధ్యత వహించాలని చాలా మంది కోరుతున్నారు. అసలు ఈ వసీమ్​ఖాన్​ను ఎవరు తీసుకొచ్చారంటూ ఆయన మండిపడ్డారు. పీసీబీ ఛైర్మన్‌ ఎహ్‌సాన్‌ మని ఇప్పుడు ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు. పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డుపై అక్తర్​ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

‘ఆటగాళ్లకు కేటాయించిన హోటళ్లలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఆటగాళ్లు కూడా ఇష్టారాజ్యంగా ఊరంతా తిరుగుతున్నారు. వాళ్లకు కరోనా వ్యాక్సినేషన్​ కూడా జరగలేదు. ఇలా ఉంటే కరోనా రాక ఏం వస్తుంది? మిగతా దేశాల్లో క్రికెట్​ టోర్నీలు ఎలా సాగుతున్నాయి. ఆయా దేశాలను చూసైనా పాకిస్థాన్​ ఎందుకు పాఠాలు నేర్చుకోవడం లేదు. ప్రస్తుతం జరిగిన ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారు’ అంటూ ఓ రేంజ్​లో విరుచుకు పడ్డారు అక్తర్​. పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు చర్యల వల్ల దేశం పరువు పోయింది. ప్రపంచ దేశాల ముందు పాకిస్థాన్​ ఎలా తలెత్తు కు తిరుగుతుంది. పాకిస్థాన్​ క్రికెటర్ల జీవితాల తో ఆడుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు.

అక్తర్​ ఆరోపణలు ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీంతో పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు బాధ్యులైన వారి పై చర్యలకు ఉపక్రమించిది. ఆటగాళ్లకు కరోనా పరీక్షలు చేసి పాజిటివ్​ వచ్చిన వాళ్లను ఐసోలేషన్​కు పంపిస్తున్నారు. మిగతా క్రికెటర్లను కూడా క్వారంటైన్​కు తరలించి కరోనా వ్యాక్సిన్లు ఇస్తున్నారు.