Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్: షిర్డీ ఆలయం మూసివేత

By:  Tupaki Desk   |   5 April 2021 3:07 PM GMT
బిగ్ బ్రేకింగ్: షిర్డీ ఆలయం మూసివేత
X
మహారాష్ట్రలోని ప్రముఖ షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేస్తూ ఆలయ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈరోజు రాత్రి 8 గంటల తర్వాత మూసివేస్తున్నట్టు ప్రకటించారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆలయం మూసివేసే ఉంచనున్నట్లు తెలిపారు.

మహారాష్ట్రలో ఇప్పుడు కరోనా కల్లోలం చోటుచేసుకుంది. కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పాక్షిక లాక్ డౌన్ ప్రకటించింది. ఈ క్రమంలోనే సాయిబాబా ఆలయంతోపాటు ‘ప్రసాదాలయ’, భక్త నివాస్’ కూడా వేసివేస్తున్నట్టు ప్రకటించారు. మహారాష్ట్రలో పాక్షిక లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత షిర్డీ ఆలయ పరిపాలన విభాగం ఈ నిర్ణయం తీసుకుంది.

గత ఏడాది దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మాదిరిగానే తీవ్రమైన ఆంక్షలు విధించాలని రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం నిర్ణయించింది. ఈ పరిమితులు ఏప్రిల్ 30 వరకు ఉంటాయి అని చెబుతున్నారు. అలాగే, వారాంతపు లాక్‌ డౌన్లు కూడా రాష్ట్రం అంతా అమల్లోకి వస్తాయి. ఇక ఆ రోజుల్లో 144 సెక్షన్ రోజంతా విధించబడుతుంది.

మామూలు రోజుల్లో కూడా రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల మధ్య సరైన కారణం లేకుండా పౌరులు తమ ఇంటిని వదిలి వెళ్ళలేరు. ఈ కర్ఫ్యూ నిబంధనల నుంచి అవసరమైన సేవలు మాత్రమే మినహాయించారు.