Begin typing your search above and press return to search.

ఇక.. భార్యభర్తలిద్దరూ ఫోన్లు అమ్ముతారంట

By:  Tupaki Desk   |   10 Oct 2015 12:51 PM IST
ఇక.. భార్యభర్తలిద్దరూ ఫోన్లు అమ్ముతారంట
X
తన అందచందాలతో యువతకు కిక్కెక్కించి.. పొడుగు కాళ్ల సుందరిగా సుపరిచితురాలైన శిల్పాశెట్టి.. ఆమె భర్త రాజ్ కుంద్రాలు ఏ రేంజ్ లో వ్యాపారాలు చేస్తారో తెలిసిందే. ఐపీఎల్ టీం దగ్గర నుంచి వారు ట్రై చేయని వ్యాపారమే లేదు.

తాజాగా.. వారు తమ కొడుకు పేరు మీద కొత్త వ్యాపారాన్ని షురూ చేయాలని డిసైడ్ అయ్యారు. కొడుకు వియాన్ పేరు మీద కొత్తగా మార్కెట్లోకి సరికొత్త మొబైల్ ఫోన్ ను లాంచ్ చేయనున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు.. వి ట్యాబ్.. బి పర్.. వి టీవీ లాంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్ని దేశీయ మార్కెట్లోకి తీసుకొస్తామని ఈ దంపతులు చెబుతున్నారు. ఇప్పటికే తమకున్న పేరు ప్రఖ్యాతులతో తమను తాము మార్కెట్ చేసుకుంటూ సంపద పోగేయటం బాగా తెలిసిన ఈ దంపతులు రానున్న రోజుల్లో మరెన్ని వ్యాపారాలు చేయనున్నారో..?