Begin typing your search above and press return to search.

టీమిండియా మహిళా క్రికెటర్ తో శిఖర్ ప్రేమాయణం.. త్వరలో పెళ్లి?

By:  Tupaki Desk   |   3 Oct 2021 2:50 PM GMT
టీమిండియా మహిళా క్రికెటర్ తో శిఖర్ ప్రేమాయణం.. త్వరలో పెళ్లి?
X
టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ మైదానంలో ఎంత డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ అందరికీ తెలిసిందే. అయితే ఇటీవలే ఆయన తన భార్యతో విడిపోయి విడాకులు తీసుకున్నాడు. ఈ వార్త క్రీడా వర్గాల్లో సంచలనమైంది. అయితే ఆ పెళ్లి విడాకుల వార్త మరిచిపోకముందే మరో పెళ్లికి శిఖర్ ధావన్ రెడీ అయినట్టుగా తెలుస్తోంది.

టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ తన భార్య అయేషా ముఖర్జీతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తొమ్మిదేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికారు. తాజాగా సోషల్ మీడియాలో శిఖర్ ధావన్ పెళ్లిపై మరోసారి చర్చ నడుస్తోంది.

శిఖర్ ధావన్ అప్పటికే పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలున్న అయేషా ముఖర్జీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ధావన్ బ్యాటింగ్ స్టైల్ లాగానే అతడి పర్సనల్ లైఫ్ కూడా ఆసక్తికరంగా దూకుడుగా సాగింది. విడాకులు తీసుకొని 10 ఏళ్లు ఒంటరిగా జీవించిన అయేషాను శిఖర్ ధావన్ తన కంటే 10 ఏళ్లు పెద్దది అయినా కూడా అయేషాను పెళ్లి చేసుకున్నాడు. అయేషా కుటుంబం ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యింది. 2009లో అయేషాను ఇంట్లో వాళ్లతో గొడవపడి బయటకు వచ్చేసిన శిఖర్ ధావన్ 2012లో ఆమెను పెళ్లాడాడు.

వ్యక్తిగతంగా తన కెరీర్ ఎదుగుదలలో అయేషా పాత్ర ఎంతో ఉందంటూ చాలా సందర్భాల్లో ప్రశంసలు కురిపించిన ధావన్ తమ అన్యోన్యతను ప్రదర్శిస్తూ వచ్చాడు. అయితే కొంత కాలంగా వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు పెరిగిపోయి దురదృష్టవశాత్తూ విడిపోయారు.

ఇప్పుడు శిఖర్ ధావన్.. ఓ భారత మహిళా సీనియర్ క్రికెటర్ ను పెళ్లాడబోతున్నాడని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. 35 ఏళ్ల వయసులోనే క్రికెట్ లో కొనసాగుతున్న సదురు మహిళా క్రికెటర్.. పెళ్లి విషయంలో ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. శిఖర్ ధావన్ కి, సదురు మహిళా క్రికెటర్ కు మంచి బంధం ఉందని.. అయేషాతో వివాహ బంధంలో అలజడి రావడానికి ఇదే కారణమంటూ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఈ మహిళా క్రికెటర్ ఎవరనేది పూర్తిగా తెలియలేదు. కానీ టీమిండియా సీనియర్ క్రికెటర్ అని తెలుస్తోంది.