Begin typing your search above and press return to search.

పెటాకులైన స్టార్ ఓపెనర్ వివాహ బంధం

By:  Tupaki Desk   |   8 Sep 2021 3:38 AM GMT
పెటాకులైన స్టార్ ఓపెనర్ వివాహ బంధం
X
టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ కు ఆయన భార్య షాకిచ్చింది. విడాకులు ఇస్తూ ఒక భారమైన హృదయంతో ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. తమ తొమ్మిదేళ్ల వివాహ బంధానికి అర్థాంతరంగా ముగింపు పలికింది. ఈ విషయాన్ని స్వయంగా శిఖర్ ధావన్ భార్య ‘అయేషా’ తన ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా బహిరంగపరచడం విశేషం. ఈ మేరకు ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ వయసు 35 ఏళ్లే. అయితే తనకంటే 11 ఏళ్లు పెద్దది అయిన అయేషాను శిఖర్ పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే అయేషాకు విడాకులు అయ్యి ఇద్దరు పిల్లలతో భర్తతో విడిపోయింది. మెల్ బోర్న్ కు చెందిన అయేషా మొదటి భర్తతో విభేదాలతో విడిపోయింది. అనంతరం 2012లో అయేషాను ధావన్ పెళ్లి చేసుకున్నాడు. వీళ్లదరికి ఒక కుమారుడు కూడా పుట్టాడు. మొదటి భర్తకు పుట్టిన ఇద్దరు కూతుళ్లను తన బిడ్డల్లాగానే శిఖర్ ధావన్ చూసుకునేవాడు. దాదాపు 9 ఏళ్లుగా అనోన్యంగా ఉన్న వీరి జీవితంలో సడెన్ విడాకులు అందరికీ షాకింగ్ గా మారాయి.

తాను క్రికెట్ లో రాణించడం వెనుక అయేషా ఉందని చాలా సందర్భాల్లో శిఖర్ ధావన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భార్యా, పిల్లలతో కలిసి మెల్ బోర్న్ లో శిఖర్ ధావన్ ఉంటున్నాడు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట వైవాహిక బంధంలో మనస్పర్థలు వచ్చాయని.. విడిపోయారని తెలిసి ఇప్పుడు అభిమానులు షాక్ అవుతున్నారు.

ధావన్ ఇప్పటివరకు తన విడాకుల సంగతి బయటపెట్టకపోగా.. అయేషా మాత్రం తాను శిఖర్ తో విడిపోయినట్టు ప్రకటించడం గమనార్హం. ఈ మేరకు ఆమె పోస్టు వైరల్ గా మారింది. ‘రెండు సార్లు విడాకులు తీసుకునేంత వరకు కూడా విడాకులు అన్నది చెడ్ద మాట అనుకునేదాన్ని..’ అని రాసుకొచ్చింది. మొదటి సారి విడిపోయినప్పుడు ఎంతో కృంగిపోయానని.. రెండోసారి అంతే బాధపడుతున్నానని అయేషా తెలిపింది. అయితే శిఖర్ ధావన్ మాత్రం విడాకులపై ఇప్పటివరకు నోరు మెదపకపోవడం గమనార్హం.