Begin typing your search above and press return to search.

ఎవడ్రా నీకు మరదలు.. టీఆర్ఎస్ మంత్రిపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   10 Sep 2022 6:01 AM GMT
ఎవడ్రా నీకు మరదలు.. టీఆర్ఎస్ మంత్రిపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
X
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల రెచ్చిపోయారు. టీఆర్ఎస్ మంత్రి నిరంజన్ రెడ్డిపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. తెలంగాణలో ప్రజాప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్న షర్మిల పాదయాత్రలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తోంది. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుంది. తాజాగా తనపై కామెంట్ చేసిన టీఆర్ఎస్ మంత్రి నిరంజన్ రెడ్డిపై నిప్పులు చెరిగింది. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిపై షర్మిల చేసిన కామెంట్స్ దుమారం రేపాయి.

వనపర్తి నియోజకవర్గంలో ప్రజాప్రస్థానం పాదయాత్రలో పాల్గొన్న వైఎస్ షర్మిల నిరంజన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో రెచ్చిపోయారు. తనను 'మంగళవారం మరదలు' అని చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసి ఘాటుగా విమర్శించారు.

గతంలో వైఎస్ షర్మిలను ఉద్దేశించి ప్రతీ మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తున్న నేపథ్యంలో మంగళవారం మరదలు అంటూ నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వైఎస్ షర్మిల తూర్పార పట్టారు. ఎవడ్రా నీకు మరదలు అంటూ ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పరాయి స్త్రీలో తల్లిని, చెల్లిని చూడలేదని సంస్కారహీనుడు మంత్రి నిరంజన్ రెడ్డి అంటూ నిప్పులు చెరిగారు.

మేం పోరాటం చేస్తుంటే నీకు మరదలు కనిపించిందా? అని నిలదీశారు. అసలు ఎవడ్రా నువ్వు అంటూ రెచ్చిపోయింది. అధికార మదంతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మెట్టు దెబ్బలు పడుతాయి అంటూ హెచ్చరించారు. వీధికుక్కకు నీకు తేడా లేదు అంటూ తీవ్రంగా తిట్టిపోశారు.

వైఎస్ షర్మిల తెలంగాణ పాదయాత్ర చేపట్టి నుంచి అటు బీజేపీపై పల్లెత్తు మాట అనడం లేదు. ఇక రెడ్డిలతో నిండిన కాంగ్రెస్ పై అసలు విమర్శలు చేయడం లేదు. ఫక్తు టీఆర్ఎస్ ను టార్గెట్ చేసి రాజకీయం చేస్తోంది. అధికార పార్టీపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తోంది. కేంద్రంలోని బీజేపీని, బండి సంజయ్ ను అయితే ఇంతవరకూ ఒక్క మాట అనలేదు. కేంద్రం అంటే భయామా? లేక కేసుల భయమా? అని టీఆర్ఎస్ నేతలు నిలదీస్తున్న పరిస్థితి. షర్మిలపై గతంలో రేవంత్ రెడ్డి తిట్టినా కూడా ఆయనపై ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.

పాదయాత్ర మొత్తం కేసీఆర్ టార్గెట్ గానే షర్మిల ముందుకెళుతోంది. ఈసారి ఓట్లు అడిగితే టీఆర్ఎస్ ను ఓడించాలని.. ఓటుకు డబ్బులు ఇస్తే తీసుకోండని.. కమీషన్ల రూపంలో దండుకున్న ప్రజల డబ్బేనని.. ఓటు మాత్రం మీకు సేవా చేసే వారికే వేయాలని వైఎస్ షర్మిల తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ ముందుకెళుతున్నారు. కానీ షర్మిల సభలకు మాత్రం పెద్దగా జనాలు రావడం లేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.