Begin typing your search above and press return to search.

జగన్ జైలుకు వెళ్లి వచ్చారు కాబట్టి .. టీడీపీ నేతలని జైలుకి పంపుతా అంటున్నారు!

By:  Tupaki Desk   |   21 Jan 2021 12:33 PM GMT
జగన్ జైలుకు వెళ్లి వచ్చారు కాబట్టి .. టీడీపీ నేతలని జైలుకి పంపుతా అంటున్నారు!
X
జేసీ బ్రదర్స్‌.. తెలుగు రాష్ట్రాల్లో వీరికి ఒక ప్రత్యేకత ఉంది. పార్టీతో సంబంధం లేకుండా విజయం సాధించడం వీరి నైజం. జేసీ దివాకర్‌ రెడ్డి.. అలాగే ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఏది మాట్లాడినా సంచలనం అవుతాయి. వీరి తర్వాత వీరి వారసులు కూడా ఇదే కోవలోకి వస్తున్నారు. జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు, జేసీ పవన్‌ కుమార్‌ రెడ్డి అధికార వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలను అరెస్ట్‌ చేయడంపై తీవ్రంగా స్పందించిన ఆయన, రాజకీయ కక్ష్య సాధింపుల్లో భాగంగానే టీడీపీ నేతలపై కేసులు పెడుతున్నారని, బీసీ నేతలను సైతం టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

సుదీర్ఘకాలంపాటు రాజకీయాల్లో ఉన్న సౌమ్యుడైన మాజీ మంత్రి కళా వెంకట్రావుపై కేసులు పెడతారా , మచ్చలేని నేతలను కూడా అరెస్ట్‌ చేస్తారా అంటూ ప్రశ్నించారు. సీఎం వైఎస్‌ జగన్ జైలుకు వెళ్లి వచ్చారు కాబట్టి, టీడీపీ నేతలను జైలుకు పంపుతున్నారని విమర్శలు చేశారు. బీసీల పేరు చెప్పుకుని రాష్ట్రంలో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డ ఆయన, ప్రభుత్వం ప్రతీ రంగంలో విఫలం అయ్యిందన్నారు. 30 ఏళ్లు ఏపీలో వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి రాజ్యం కావాలంటే చెప్పండి. మేం తప్పుకుంటామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, రాష్ట్ర మంత్రులకు తిట్టడం తప్ప వేరే పనిలేదంటూ సెటైర్లు వేసిన పవన్‌ రెడ్డి, స్థానిక సంస్థల ఎన్నికలు అంటే, జగన్ కి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.