Begin typing your search above and press return to search.

మ్యాక్స్​వెల్​ ఐపీఎల్​ కు వచ్చేది ఎంజాయ్ చేసేందుకే.. మాజీ ఓపెనర్ ఫైర్

By:  Tupaki Desk   |   10 Dec 2020 10:50 AM GMT
మ్యాక్స్​వెల్​ ఐపీఎల్​ కు వచ్చేది ఎంజాయ్ చేసేందుకే.. మాజీ ఓపెనర్ ఫైర్
X
ఆస్ట్రేలియా క్రికెటర్​ మ్యాక్స్​వెల్​ ఐపీఎల్​ 2020లో దారుణంగా ఫెయిల్​ అయ్యాడు. కింగ్స్​ ఎలెవెన్​ పంజాబ్​ జట్టు మాక్స్​ను రూ. 10 కోట్లు పెట్టి కొన్నది. కానీ అతడు మాత్రం ఒక్క మ్యాచ్​ కూడా సరిగ్గా ఆడలేదు. అయితే ఆ వెంటనే ప్రారంభమయిన ఇండియా- ఆస్ట్రేలియా టూర్​లో మ్యాక్స్​వెల్​ రెచ్చిపోయి ఆడుతున్నాడు. దీంతో అతడిపై సోషల్​మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి.

తాజాగా మాజీ క్రికెటర్​, డాషింగ్​ ఓపెనర్​ వీరేంద్ర సెహ్వాగ్​ సైతం మ్యాక్స్​వెల్​ను తీవ్రంగా ట్రోల్​ చేశాడు. మ్యాక్స్​వెల్​ కేవలం కూల్​డ్రింక్స్​ తాగేందుకు, ఎంజాయ్​ చేసేందుకు మాత్రమే ఐపీఎల్​కు వస్తాడని మండిపడ్డారు. సొంతదేశం తరఫున ఒక్క మ్యాచ్ లో సరిగ్గా ఆడకపోయినా తర్వాత మ్యాచ్​లో అతడు ఉండడు. కానీ అదే ఐపీఎల్​లో అయితే ఒక్కసారి డబ్బులు చెల్లించి కొన్నామంటే చివర వరకు అతడిని భరించాల్సిందే. అందుకు మ్యాక్స్​వెల్​ ఇలా చేస్తున్నాడు. మనం రెండు రకాలైన మ్యాక్స్​వెల్​ను చూస్తాం. మ్యాక్స్​వెల్​ రెండు రకాలుగా ప్రవర్తిస్తాడని.. తన సొంతదేశం తరఫున ఒకలాగా ఐపీఎల్​లో మరోలా ఆడతాడని మండిపడ్డారు.ఐపీఎల్​ సీజన్​లో అతడికి అస్సలు బాధ్యత ఉండదని.. ఎప్పుడూ ఎంజాయ్​ చేస్తూ కనిపిస్తాడని పేర్కొన్నారు.

కాగా ఆరోపణలపై మ్యాక్స్​వెల్​ స్పందిస్తూ.. వీరు చేసిన వ్యాఖ్యలపై నేను మాట్లాడదలచుకోలేదు. ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేయనందుకు అతనికి నాపై కోపం ఉన్నట్టుంది. అతని వ్యాఖ్యలు నన్ను ఏ మాత్రం ఇబ్బంది పెట్టవు’ అని పేర్కొన్నాడు. గత ఐపీఎల్​లో మ్యాక్స్​వెల్​ మొత్తం 13 మ్యాచ్​లు ఆడి కేవలం 105 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కానీ ఆస్ట్రేలియా టూర్​లో మాత్రం మూడు వన్డేల్లో 167 పరుగులు, మూడు టీ20లలో 78 పరుగులు సాధించాడు. దీంతో అతడిపై విమర్శలు వస్తున్నాయి.