Begin typing your search above and press return to search.

ఏపీ వ్యాప్తంగా రెండోరోజు వ్యాక్సినేషన్

By:  Tupaki Desk   |   17 Jan 2021 10:27 AM GMT
ఏపీ వ్యాప్తంగా రెండోరోజు వ్యాక్సినేషన్
X
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండోరోజు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 332 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు వ్యాక్సిన్ సాగింది.

రాష్ట్రంలో తొలిరోజు కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ విజయవంతం కాగా.. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలుగుకుండా.. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కార్యక్రమం కొనసాగింది.

దేశంలోనే అత్యధికంగా 332 కేంద్రాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ నిరంతరం కొనసాగింది. శనివారం 19,108 మంది హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సిన్ వేశారు. వాస్తవానికి కేంద్రప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం 14300 మాత్రమే. ఈ లక్ష్యానికి మించి టీకా కార్యక్రమం కొనసాగింది.

దేశంలో కరోనా నియంత్రణ, నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ ఎలా ముందంజ వేసిందో వ్యాక్సిన్ వేసే ప్రక్రియలోనూ దేశంలో మన రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని ఏపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి..

దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 21,291 మందికి వ్యాక్సిన్ వేశారు. జనాభా ప్రాతిపదికన వ్యాక్సిన్ వేసిన వారి సంఖ్య చూస్తే ఏపీ అత్యధికం. అత్యల్పంగా లక్షద్వీప్ లో 21 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేశారు.

ఎక్కువమందికి టీకా ఇచ్చిన జాబితాలో యూపీ ప్రథమ స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఏపీ, మూడో స్థానంలో మహారాష్ట్ర నిలిచాయి.