Begin typing your search above and press return to search.

మరీ ఇంత ఆరాచకమా?

By:  Tupaki Desk   |   28 Feb 2022 2:41 AM GMT
మరీ ఇంత ఆరాచకమా?
X
కనివిని ఎరుగని.. కలలో కూడా ఊహించని దారుణాలు.. దురాగతాలు ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయి. మనషులా.. ఆ రూపంలో ఉన్న పిశాచులా? అన్న సందేహం కలిగేలా చేస్తున్న నేరాలు.. ఘోరాలు అంతకంతకూ ఎక్కువతున్నాయి. తాజాగా బయటకొచ్చిన దారుణ ఉదంతం చూస్తే.. మరీ ఇలాంటి ఆరాచకమా? అన్న విస్మయానికి గురి కాక మానదు. పెళ్లై.. అత్తారింటికి వచ్చిన రెండో రోజులకే.. ఇంట్లోని వారిందరికి పెట్టే భోజనంలో విషం కలిపేసి.. పారిపోయిన వైనం ఇప్పుడు నోటి వెంట మాట రాకుండా చేస్తోంది.

పెళ్లి చేసుకునేదే.. ఆనందకరమైన జీవితం కోసం. అలాంటి ఆలోచనలతో పెళ్లి చేసుకున్న ఒక యువకుడి జీవితం.. పెళ్లాం ఇంటికి వచ్చిన రెండో రోజుకే అతడి జీవితం తెల్లారిపోయింది. రాజస్థాన్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతాన్ని చూస్తే.. కోట్ పుట్లీ ప్రాంతానికి చెందిన నందు అనే వ్యక్తి పూజారాణి అనే అమ్మాయిని పెళ్లాడారు. పెళ్లైన తర్వాత అత్తారింటికి వచ్చింది. కొత్త కోడలు ఇంట్లోకి అడుగు పెట్టేసిన ఆనందంలో ఉన్న కుటుంబానికి అనుకోని అపాయం.. కోడలి రూపంలో విరుచుకుపడింది.

అత్తారింటికి వచ్చిన రెండో రోజే.. వంట చేసిన కొత్త పెళ్లికూతురు తానే స్వయంగా అన్నం వండి.. భర్త.. అత్తమామలకు భోజనం పెట్టింది. ఆమె చేతి వంట తిన్న కాసేపటికే అందరూ స్పృహ కోల్పోయారు. ఆ వెంటనే.. నగలు.. డబ్బులు తీసుకొని సదరు పెళ్లికుమార్తె జంప్ అయ్యింది. పక్కరోజున నందు ఇంట్లో ఎలాంటి అలికిడి లేకుండా ఉండటంతో పక్కింటి వారు..

ఆరా తీశారు. అనుమానం వచ్చి తలుపు పగలగొట్టి చూస్తే.. స్పృహలో లేకుండా కుటుంబ సభ్యులంతా పడిపోమయిన వైనాన్ని గుర్తించారు. వెంటనే..పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. ఇంట్లో ఉంటున్న వ్యక్తి మిస్ కావటంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి.

దీనికి తోడు.. వైద్యులు ఇచ్చిన రిపోర్టు చూస్తే..అన్నంలో విషం కలిపిన దాన్ని తిన్నందుకు ఆమె భర్త చనిపోగా.. వమిగిలినవారు ఆసుపత్రి పాలయ్యారు. దీంతో.. ఈ కొత్త పెళ్లికుమార్తె కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇంతకీ ఈ సంబంధం ఎలా వచ్చిందంటే.. ఒక మధ్యవర్తి చూపించటంతో.. అతన్ని నమ్మి పెళ్లి చేసుకున్నారు. ఆమె మాత్రం అందుకు భిన్నంగా గుండెలు తీసిన బంటు మాదిరి వ్యవహరించారని చెప్పక తప్పదు.ఇప్పుడీ కొత్త పెళ్లి కుమార్తె కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.