Begin typing your search above and press return to search.

సేవ్ చేయ‌బోయి 8 మందిని బ‌లి తీసుకున్నాడు

By:  Tupaki Desk   |   20 July 2015 9:03 AM GMT


విశాఖ‌ప‌ట్నంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. మ‌దుర‌వాడ స‌మీపంలో ఒక ఆటోనీ ఆర్టీసీ బ‌స్సు ఢీ కొన్న ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది ఘ‌ట‌నా స్థ‌లంలోనే మ‌ర‌ణించారు.

రోడ్డు ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతం మృత‌దేహాలు చెల్లాచెదురుగా ప‌డిపోయి భీతావాహంగా మారింది. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురు గాయ‌ప‌డ్డారు. ఇక‌.. ఈ ఘోర ప్ర‌మాదం జ‌రిగిన ఉదంతాన్ని చూస్తే.. వేగంగా వెళుతున్న ఆర్టీసీ బ‌స్సు ఒక వాహ‌నాన్ని త‌ప్పించ‌బోయి.. ఎడ‌మ‌వైపుకు తిప్పారు. అక్క‌డే ఉన్న ఆటోను బ‌స్సు ఢీ కొంది. బ‌స్సును అదుపు చేసేందుకు డ్రైవ‌ర్ కు కొద్ది టైం ప‌ట్టింది. అప్ప‌టికే జ‌ర‌గాల్సిన దారుణం జ‌రిగిపోయింది.

వేగంగా ప్ర‌యాణిస్తున్న బ‌స్సు.. ఏకంగా యాభై అడుగులు ఆటోను లాక్కెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో 8 మంది అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. మ‌రో ఐదుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. ఆటోతో పాటు.. కొన్ని షాపులు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ ఘ‌ట‌నతో.. ఆ ప్రాంత‌మంతా బీభ‌త్సంగా మారింది. మృత‌దేహాలు చెల్లాచెదురుగా ప‌డిపోవ‌టం.. షాపులు ధ్వంసం కావ‌టంతో అక్క‌డి సీన్ భ‌యాన‌కంగా మారింది. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌త్య‌క్ష సాక్ష్యులు చెబుతున్నారు.