Begin typing your search above and press return to search.

రూ.1,500 కోట్ల స్కామ్...ఇద్దరిని అరెస్ట్ చేసిన ఈడీ !

By:  Tupaki Desk   |   8 March 2021 11:32 AM GMT
రూ.1,500 కోట్ల స్కామ్...ఇద్దరిని అరెస్ట్ చేసిన ఈడీ !
X
విదేశాలకు అక్రమంగా నిధుల తరలింపు కేసులో ఇద్దరిని ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్ట్‌ చేసింది. సాఫ్ట్‌ వేర్‌ ఎగుమతుల పేరుతో రూ.1500 కోట్లు విదేశాలకు తరలించారనే ఆరోపణలపై దీపక్‌ అగర్వాల్‌, ఆయుష్‌ గోయల్‌ ను ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. చైనా, సింగపూర్‌, హాంకాంగ్ ‌కు నిధులు మళ్లించినట్లు వీరిపై ఆరోపణలున్నాయి. విశాఖ కోర్టు అనుమతితో దీపక్ అగర్వాల్ ను మూడు రోజుల కస్టడీకి తీసుకున్న ఈడీ, ఆయుష్ గోయల్ ను కూడా కస్టడీకి ఇవ్వాలని విశాఖ కోర్టును కోరింది.

ఆదాయపన్ను శాఖ ఫిర్యాదుతో వడ్డీ మహేష్ పై గతంలో ఏపీ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రమోద్ అగర్వాల్, ఆయుష్ గోయల్, వికాస్ గుప్తా, వినీత్ గోయెంకా నిధులను వడ్డీ మహేష్ మళ్లించినట్లు గుర్తించారు. ప్రధాన సూత్రధారి బీకే గోయెల్ ను ఇప్పటికే అరెస్టు చేసిన ఈడీ, డొల్ల కంపెనీలు సృష్టించి వడ్డి మహేష్ విదేశాలకు నిధులు మళ్లించినట్లు గుర్తించింది.