Begin typing your search above and press return to search.
రోజాపై ఏడాది పాటు వేటు పడింది!
By: Tupaki Desk | 18 Dec 2015 6:17 PM ISTఏపీ అసెంబ్లీ తీవ్ర నిర్ణయానికి వేదికగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు రోజాపై ఏడాది పాటు వేటు వేస్తూ స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రకటించారు.
శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి.. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రోజాపై చర్యలు తీసుకోవాలని.. ఆమెపై ఏడాది పాటు వేటు వేయాలంటూ ఏపీ అధికారపక్ష ఎమ్మెల్యేలు కోరటం.. దీనికి సంబంధించి మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపాదన చదవగా.. దీనికి స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆమోద ముద్ర వేశారు. దీంతో.. ఏపీ విపక్ష పార్టీకి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ గా పేరొందిన రోజా ఏడాది పాటు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోనున్నారు.
శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి.. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రోజాపై చర్యలు తీసుకోవాలని.. ఆమెపై ఏడాది పాటు వేటు వేయాలంటూ ఏపీ అధికారపక్ష ఎమ్మెల్యేలు కోరటం.. దీనికి సంబంధించి మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపాదన చదవగా.. దీనికి స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆమోద ముద్ర వేశారు. దీంతో.. ఏపీ విపక్ష పార్టీకి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ గా పేరొందిన రోజా ఏడాది పాటు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోనున్నారు.
