Begin typing your search above and press return to search.

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి

By:  Tupaki Desk   |   23 April 2022 6:30 AM GMT
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
X
అమెరికాలో తెలుగు విద్యార్థుల మరణం కలిచివేసింది. ఇల్లినాయిస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు సహా డ్రైవర్ తో ముగ్గురు మరణించారు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వారే టౌన్ నుంచి ఈస్ట్ కేప్ కు వేగంగా వెళుతున్న ఫియట్ కారు అదుపు తప్పి సెంటర్ లైన్ దాటి పక్క రోడ్డుపైకి దూసుకెళ్లి ఆ రోడ్డుపై వస్తున్న టయోటా కారును ఢీకొంది.

ఈ ఘటనలో ఫియట్ కారు నడుపుతున్న డ్రైవర్ మారి మ్యూనియర్(32)తోపాటు అందులో ప్రయాణిస్తున్న వంశీ పెచ్చెట్టి(23), టయోటా కారు నడుపుతున్న పవన్ స్వర్ణ (23) అక్కడికక్కడే కన్నుమూశారు.

టయోటా కారులో ప్రయాణిస్తున్న యశ్వంత్ ఉప్పలపాటి, కాకుమాను కార్తీక్, డోర్న కల్యాణ్ లకు తీవ్ర గాయాలయ్యాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ ఐదుగురు విద్యార్థులు కాబండేల్ టౌన్ లోని సదర్ ఇల్లినాయస్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

వీరిలో కల్యాణ్ సివిల్ ఇంజినీరింగ్ చదువుతుండగా.. మిగిలిన వాళ్లంతా కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు. ప్రమాద తీవ్రత నేపథ్యంలో పోలీసులు అక్కడ రూట్ ను 3 గంటల పాటు మూసివేశారు.