Begin typing your search above and press return to search.

వైరల్: మోడీ సర్కార్ గాలితీసేలా వర్మ ట్వీట్

By:  Tupaki Desk   |   26 April 2021 10:30 AM GMT
వైరల్: మోడీ సర్కార్ గాలితీసేలా వర్మ ట్వీట్
X
అన్నింట్లోనూ ప్రథమం అని డప్పు కొట్టుకునే మోడీ సర్కార్ ను టైం చూసి కొట్టాడు రాంగోపాల్ వర్మ.. ఈ వివాదాస్పద దర్శకుడు తాజాగా దేశంలో కరోనా కల్లోలంలో ఆక్సిజన్ కొరతతో రోగులు చనిపోవడాలు.. కేసులు పెరుగుదల.. వైద్య సేవలు అథమం స్థాయికి చేరిన వేళ మోడీ సర్కార్ ను టార్గెట్ చేస్తూ ఘాటు చురకలు అంటించారు.

మోడీ ఘనంగా చెప్పుకుంటున్న ఘనతలపై వర్మ ట్వీట్ చేశాడు. ఆ తర్వాత దేశంలో ఇప్పుడు ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందక చనిపోతున్న రోగులపై ట్వీట్ లో ఎద్దేవా చేశారు. వర్మ చేసిన ట్వీట్ కు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది.

వర్మ ట్వీట్ చేస్తూ.. ‘ప్రపంచంలోనే అతిపెద్ద సర్ధార్ పటేల్ విగ్రహాన్ని గుజరాత్ లో కట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియాన్ని అహ్మదాబాద్ లో నిర్మించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. ప్రపంచంలోనే అతిపెద్ద కులాల మీటింగులు నిర్వహించారు. కానీ.. ఆస్పత్రుల్లో రోగులను బతికించేందుకు కనీస సదుపాయాలు కల్పించలేకపోయారు’ అంటూ మోడీ సర్కార్ ను ఉద్దేశిస్తూ పరోక్షంగా వర్మ ఎండగట్టారు.

వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ప్రధానంగా మోడీని ఎండగట్టినట్టుగా ఉంది.