Begin typing your search above and press return to search.

సమాచార హక్కు చట్టానికి - రేవంత్ రెడ్డికి ఉన్న లింకేంటీ .. తెలుగు ప్రజల్లో సంచలన చర్చ !

By:  Tupaki Desk   |   21 March 2020 2:30 PM GMT
సమాచార హక్కు చట్టానికి - రేవంత్ రెడ్డికి ఉన్న లింకేంటీ .. తెలుగు ప్రజల్లో సంచలన చర్చ !
X
రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ..అంటే సమాచార హక్కు చట్టం. ఈ చట్టం గురించి ప్రజలకు పెద్దగా తెలియదు, అలాగే ఈ చట్టం సాధారణ ప్రజలకి ఏమేర ఉపయోగపడుతుందో తెలియదుకానీ, కొందరు రాజకీయ నేతలకి కల్పవృక్షంగా, కామధేనువు. అయితే , అసలు ఎంపీ రేవంత్ రెడ్డికి.. సమాచార హక్కు చట్టంతో ఉన్న లింక్ ఏంటీ.. RTI అంటే రేవంత్ ట్యాక్స్ ఇన్ కమ్ అనే పేరుగా ఎందుకు విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. ఓ ప్రముఖ ఛానల్ లో కూడా ఆర్టీఐ చట్టం అడ్డంపెట్టుకుని రేవంత్ రెడ్డి దోపిడీ చేశాడని ఎందుకు ప్రసారం చేస్తుంది. ఈ విమర్శలు, ఆరోపనలు ఎలా వచ్చాయో వివరంగా తెలుసుకుందాం..

సమాచార హక్కు చట్టం కింద ప్రొజెక్టులు, ప్రభుత్వం పథకాలు, ప్రైవేట్ సంస్థల వివరాలు, కాంట్రాక్టుల వివరాలు రేవంత్ రెడ్డి సంపాదించేవారంట. ఆ సమాచారం అడ్డంపెట్టుకుని.. అందులోని లూప్ హోల్స్ ను ప్రజాప్రతినిధిగా ప్రశ్నించకుండా, బ్లాక్ మెయిల్ దిగేవారు అని కొందరు చర్చించుకుంటున్నారు. ఆలా బ్లాక్ మెయిల్ చేసిన కంపెనీల నుంచి లక్షలు, కోట్లు కొట్టేసేవారని ఆరోపణలు కూడా అయన పై ఉన్నాయి. ఈ చట్టాన్ని ఉపయోగించుకుని రేవంత్ అండ్ గ్యాంగ్, ప్రముఖ వ్యాపారుల నుంచి కోట్ల రూపాయలను తీసుకున్నదంట. ఎవరైనా వ్యాపారులు, సంస్థలు అడ్డం తిరిగితే తనకు ఉన్న పార్టీ ఇమేజ్, నోటి దురుసు, మీడియాలోని వ్యక్తులతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి అల్లరి చేసేవారిని అంటున్నారు. దీనితో  ఈ గోలంతా ఎందుకు అనుకుని.. అడిగినంత సమర్పించుకునే వారని కొందరు చెప్తున్నారు.  

అప్పట్లో టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి.. ఆ పార్టీకే చెందిన ఓ బడా నేతతో కలిసి దందా చేసినట్లు ప్రచారం జరగుతోంది. పెద్ద కాంట్రాక్టు వర్క్స్, ప్రాజెక్టులు, ఆస్పత్రులు, టెండర్లకు సంబంధించిన సమాచారం కోరుతూ RTI కమిషన్ కి వెళ్తారంట. డేటాను సంపాదిస్తారు. ఆ డేటా ఆధారంగా కాంట్రాక్టుల్లో, పనుల్లో లోపాలను గుర్తిస్తారు. సంబంధిత సంస్థలు, మేనేజ్ మెంట్ల దగ్గరకు వెళ్లి ఈ వివరాలు వాళ్ల ముందు పెట్టి భారీగా డబ్బు డిమాండ్ చేస్తారంట. ఇవ్వకపోతే మీడియాకు లీక్ చేస్తామని బెదిరించేవారంట. శాంపిల్ గా కొన్ని ఛానల్స్ లో వేయిస్తారంట కూడా. సహజంగానే ఇరిగేషన్, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఏదో ఒక అవకతవకలు ఉంటాయి. సమాచార కమిషన్ రిపోర్ట్ చూడగానే.. ఈ గోల ఎందుకు అనుకుంటారు. దీంతో రేవంత్ కు రకరకాల రూపాల్లో కోట్ల రూపాయలను ఆయా కంపెనీలు చెల్లించారనేది ప్రస్తుత ప్రధాన ఆరోపణ.

ఏదో ఒకటి, రెండు సెటిల్ మెంట్లు గుట్టుగా చేసుకుంటే బయటకు వచ్చేది కాదు.  కానీ , ఏడు సంవత్సరాల్లో 20కిపైగా సెటిల్ మెంట్లు చేశారనేది రాజకీయ వర్గాల మాట. రేవంత్ వలలో పెద్ద పెద్ద వాళ్లే పడిపోయారట.  చివరికి సమాచార హక్కుని ఇలా భ్రష్టుపట్టించారనే అపవాదుగా మూటగట్టుకున్నారంట. మితంగా తింటే ఆరోగ్యం.. అతిగా తెగబడి తింటే ఇలాంటి అభాండాలు మోయాల్సిందే.. హీరోయిజం అనేది విలనిజంగా నుంచి పుడితే.. ఎప్పటికైనా ఇలాంటి అవమానాలు, విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటారనటానికి రేవంత్ రెడ్డి వ్యవహారం తెలుగు ప్రజల్లో చర్చనీయాంశం అయ్యింది. సమాచార హక్కు చట్టం.. ఆర్టీఐ వ్యవహారం కలకలం రేపుతోంది.