Begin typing your search above and press return to search.

కరోనా: ఊపిరితిత్తులే కాదు.. మెదడుకు చేటే

By:  Tupaki Desk   |   27 Jun 2020 9:00 AM IST
కరోనా: ఊపిరితిత్తులే కాదు.. మెదడుకు చేటే
X
కరోనా ప్రపంచాన్ని కబళిస్తోంది. ప్రధానంగా ఊపిరితిత్తులపై దాడి చేసే ఈ మహమ్మారి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు చేసి చివరికి మనిషి ప్రాణం తీస్తుంది. అయితే తాజా పరిశోధనలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.

తాజాగా కరోనా కారణంగా ఆస్పత్రి పాలైన 125మందిని పరీక్షించగా వారికి కరోనాతోపాటు సైకోసిస్, కన్ఫ్యూజన్, స్టోక్స్ కూడా వస్తున్నాయని లివర్ ఫూల్ యూనివర్సిటీ న్యూరాలజిస్టులు తేల్చారు.

125 మంది కరోనా రోగుల్లో 77మందికి మెదడులోని రక్తం సరఫరాలో తేడాలు ఉన్నట్టు గుర్తించారు. చాలామంది మెదడులోని రక్తనాళాల్లో రక్తం గడ్డం కట్టినట్టు గుర్తించారు. తక్కువ వయసున్న వారిలోనూ మెదడుకు స్టోక్స్ వస్తున్నట్టు తేలింది. దీనివల్ల 125మంది మానసిక స్థితి మారుతోందని తెలిపారు.

60 ఏళ్లు కంటే తక్కువ వయసున్న వారిలో మానసిక స్థితులు మారిపోతున్నాయని.. కన్ఫ్యూజన్, డిప్రెషన్ కు గురి అవుతున్నారని తేల్చారు. కరోనా వైరస్ కారణంగా మెదడుపై ఎఫెక్ట్ పడుతోందని పరిశోధకులు తేల్చారు.