Begin typing your search above and press return to search.

ఆస్తి గొడవలే కుదురుగా ఉండనివ్వడం లేదా?

By:  Tupaki Desk   |   19 July 2017 9:37 AM GMT
ఆస్తి గొడవలే కుదురుగా ఉండనివ్వడం లేదా?
X
స్వయంగా చంద్రబాబు నచ్చజెప్పినా కూడా మంత్రి భూమా అఖిలప్రియ - ఏవీ సుబ్బారెడ్డి మధ్య ఏమాత్రం సయోధ్య కుదరడం లేదు. ఉప ఎన్నికల వేళ ఇద్దరూ ఒకరితో ఒకరు సఖ్యతగా లేకపోవడంతో పార్టీ విజయావకాశాలు దెబ్బతింటున్నాయని చంద్రబాబు ఘోషిస్తున్నా ప్రయోజనం కలగడం లేదట. అయితే... భూమా నాగిరెడ్డికి ఆత్మలా వ్యవహరించిన ఏవీ సుబ్బారెడ్డి ఇప్పుడు నాగిరెడ్డి కుమార్తెకు ఎందుకంత వ్యతిరేకి అయ్యారన్న విషయంలో కర్నూలులో రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. కోట్ల విలువైన ఆస్తులు - వ్యాపారాల విషయంలోనే ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది.

నాగిరెడ్డి బతికి ఉన్నప్పుడు ఆయన ఆస్తులు, పెట్టుబడులు, డబ్బులు దాచిన ప్రదేశాలు అన్నీ ఏవీ సుబ్బారెడ్డికి తెలిసేవట. చాలా ఆస్తులకు సుబ్బారెడ్డే బినామీగా ఉండేవారని టాక్. కానీ, నాగిరెడ్డి హఠాన్మరణంతో పరిస్థితి మారిపోయిందని... సుబ్బారెడ్డి తమ ఆస్తులను నొక్కేయడానికి ప్లాన్ చేస్తున్నారని అఖిల ప్రియ వర్గం నుంచి ఆరోపిస్తోందని అంటున్నారు.

భూమా ఆస్తులు - వ్యాపారాలకు సంబంధించి శోభానాగిరెడ్డికి తెలియని వివరాలు కూడా సుబ్బారెడ్డికి తెలుసంటున్నారు. కానీ భూమా నాగిరెడ్డి మరణం తర్వాత వాటిపై సుబ్బారెడ్డి నుంచి సరైన స్పందన - వివరణ లేదని అఖిలప్రియ ఆగ్రహంగా ఉన్నారని... వివాదాలూ అందుకే అని ప్రచారం జరుగుతోంది. పైగా చంద్రబాబు అఖిల ప్రియ కంటే సుబ్బారెడ్డికి ప్రయారిటీ ఇస్తుండడంతో కూడా అఖిల గుర్రుగా ఉందని అంటున్నారు.