Begin typing your search above and press return to search.

కేసీఆర్ పై ఆ కామెంట్ అదిరిపోయింది

By:  Tupaki Desk   |   24 Jan 2016 7:16 AM GMT
కేసీఆర్ పై ఆ కామెంట్ అదిరిపోయింది
X
గ్రేటర్ ఎన్నికలు తెలంగాణలో నేతల మధ్య మాటల వేడిని పెంచాయి. టీడీపీ నేతలు ప్రచారం తమ దూకుడు పెంచుతున్నారు. టీటీడీపీ సీనియర్ నేత - మాజీ ఎంపీ రావుల చంద్రశేఖరరెడ్డి కూడా గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీఆరెస్ - కేసీఆర్ లపై విమర్శలు గుప్పించారు. కూల్ గా కనిపించే ఆయన సున్నితమైన సెటైర్లు వేయడంలో సిద్ధహస్తులన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా అదే టైపులో కేసీఆర్ కు భారీ సెటైర్ వేసి ముసిముసి నవ్వులు నవ్వారు రావుల. హైదరాబాద్ లో చైన్ స్నాచింగ్ లు పెరిగిపోయిన నేపథ్యంలో రావుల చేసిన కామెంటు ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది. సిటీలో కేవలం సీఎం కేసీఆర్ మెడలోని గొలుసు మాత్రమే భద్రంగా ఉందని... మిగతి అందరి మెడలోని గొలుసులు చైన్ స్నాచర్లు ఎత్తుకెళ్లిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. దీంతో హైదరాబాద్ మహానగరంలో దొంగతనాలు ఎంత తీవ్రంగా ఉన్నాయి... శాంతి భద్రతల్లో డొల్లతనం అంతా ఒక్క మాటతో ఏకిపారేశారు.

హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ విడుదల చేసిన ఎన్నికల మానిఫెస్టోని కూడ రావుల ఏకిపారేశారు. గతంలో చేసిన హామీలను పక్కన బెట్టి కొత్త ప్రాచారాలుచేసుకుంటున్నారని ఈయన విమర్శించారు.షీ టీమ్ ల గురించి టిఆర్ ఎస్ గొప్పగా ప్రచారం చేసుకుంటోందని, ముఖ్యమంత్రి కెసిఆర్ మెడలోని బంగారు గొలుసు మాత్రమే భద్రంగా ఉందని, నగరంలో ఆడవాళ్ల మెడల్లోని గొలుసులు దొంగలు తెంచుకుపోయారని అన్నారు.