Begin typing your search above and press return to search.

గొడ్డు మాంసం తిని!..హిందువుల‌ను ఎగతాళి చేసి!

By:  Tupaki Desk   |   26 Nov 2017 8:13 AM GMT
గొడ్డు మాంసం తిని!..హిందువుల‌ను ఎగతాళి చేసి!
X
రాజ్‌దీప్ స‌ర్దేశాయ్‌... ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ప్ర‌స్తుతం ఇండియా టుడే మీడియా సంస్థ‌లో ప‌నిచేస్తున్న రాజ్‌దీప్‌... గ‌తంలో ఎన్డీటీవీలోనూ చాలా కాలం పాటు ప‌నిచేశారు. త‌న‌దైన మాట‌ల మంత్రంతో, ఆయా విష‌యాల‌పై స‌మ‌గ్ర‌మైన అవ‌గాహ‌న‌తో ఆయ‌న నిర్వ‌హించిన న్యూస్ డిబేట్స్ ఎన్డీటీవీలో యావ‌త్తు దేశ ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకున్నాయి. మొత్తంగా జ‌ర్న‌లిస్టుగా త‌న‌ను తాను స‌ర్దేశాయ్ బాగానే ఎలివేట్ చేసుకున్నారు. అయితే దేశంలోని ప‌లు మీడియా సంస్థ‌ల్లాగే... రాజ్ దీప్ కూడా ఒక వ‌ర్గానికి మాత్ర‌మే కొమ్ముకాస్తార‌ని, త‌న‌కు అనుకూల‌మైన రాజ‌కీయ నేత‌ల‌పై ఎలాంటి వార్త‌లు ప్ర‌సారం చేసేందుకు ఆయ‌న ఇష్ట‌ప‌డ‌ర‌ని ఆయ‌న‌పై ముద్ర ప‌డిపోయింది. ఈ త‌ర‌హా ప్ర‌చారం ఎంత‌గా జ‌రిగినా కూడా రాజ్ దీప్ పెద్ద‌గా ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. అంతేకాకుండా ఈ త‌ర‌హా త‌న వైఖ‌రితోనే ముందుకు సాగేందుకు ఆయ‌న ఏమాత్రం జంకూ బొంకూ లేకుండానే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని కూడా చెప్పాలి.

మొన్నామ‌ధ్య ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అమెరికా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా రాజ్‌దీప్‌ పై ఏకంగా దాడి జ‌రిగినంత పని అయ్యింది. బుర్ర త‌క్కువ ప్ర‌శ్న‌లు అడ‌గ‌డంలో అందె వేసిన చేయిగా పేరొందిన రాజ్‌దీప్‌... గ‌తంలో ప‌లుమార్లు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేత చీవాట్లు తిన్నారు. మొన్న‌టికి మొన్న రాష్ట్రప‌తి ప‌దవి నుంచి దిగిపోయిన త‌ర్వాత ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ కూడా రాజ్‌దీప్‌ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. అయినా కూడా స‌ర్దేశాయి ఏమాత్రం త‌న వైఖ‌రిని మార్చుకున్న దాఖ‌లా క‌నిపించ‌లేదు. అయినా ఉన్న‌ట్టుండి రాజ్‌దీప్ గురించి ఇంత పెద్ద ఉపోద్ఘాతం ఎందుక‌నుకుంటున్నారా? నిన్న‌టిదాకా కేవ‌లం వార్త‌ల‌తోనే వివాదాల్లో కూరుకుపోయిన ఆయ‌న‌... ఇప్పుడు ఏకంగా హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా ఓ పెద్ద ప‌నే చేశారు. ఈ ఒక్క ప‌నితో ఇప్పుడు రాజ్‌దీప్‌ పై నెటిజ‌న్లు ఫైరైపోతున్నారు.

అయినా రాజ్‌దీప్ ఏం చేశార‌న్న విష‌యానికి వ‌స్తే... ఇంకేం చేయాలి? హిందువుల‌ను కించ‌పరిచేందుకు ఆయ‌న ఓ పెద్ద సాహ‌స‌మే చేశారు. గొడ్డు మాంసం తిన‌డంతో పాటుగా హిందువుల‌ను రెచ్చ‌గొట్టేలా వ్యాఖ్య‌లు చేశారు. గొడ్డు మాంసం తిన్న త‌ర్వాత‌... ఆ విష‌యాన్ని బ‌హిరంగంగా ప్ర‌క‌టించేసిన రాజ్‌దీప్‌... తాను ఇప్పుడు హిందువునేనా? అంటూ కామెంట్ కూడా చేశారు. ఈ ఎపిసోడ్‌పై నెటిజ‌న్లు చాలా ఘాటుగా స్పందించార‌రు. రాజ్‌దీప్ కామెంట్ల‌ను టార్గెట్ చేస్తూ... అస‌లు వివాదం లేకుండా గ‌డ‌ప‌లేరా? అయినా ఎప్పుడూ హిందువుల‌ పై ప‌డి ఏడుస్తుంటారు? దేశ ప్ర‌జ‌ల‌ను ప‌ట్టి పీడిస్తున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించ‌లేని రాజ్‌దీప్‌... ఇలాంటి వివాదాల‌కు మాత్రం బాగానే కార‌ణ‌మ‌వుతున్నారంటూ నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు సంధించారు.