Begin typing your search above and press return to search.

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి భ‌ర్త‌పై భారీ కేసు!

By:  Tupaki Desk   |   6 Jun 2018 5:00 AM GMT
ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి భ‌ర్త‌పై భారీ కేసు!
X
బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టి.. యోగా శిక్ష‌కురాలిగా ఇటీవ‌ల పేరు పొందిన శిల్పా శెట్టి భ‌ర్త రాజ్‌కుంద్రాపై ఈడీ అధికారులు మ‌నీ లాండ‌రింగ్ కేసు పెట్టారు. బిట్ కాయిన్ కేసులో పెద్ద ఎత్తున అక్ర‌మ లావాదేవీల‌కు రాజ్ కుంద్ర పాల్ప‌డిన‌ట్లుగా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు గుర్తించారు.

ఇత‌డిపై వ‌చ్చిన ఆరోప‌ణ‌లపై విచార‌ణ జ‌రిపిన వారికి ప‌లు ఆధారాలు ల‌భ్య‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో రాజ్ కుంద్ర‌ను ప‌ది గంట‌ల పాటు విచార‌ణ జ‌రిపారు. బిట్ కాయిన్ కేసులో శిల్పా శెట్టి.. రాజ్ కుంద్రా దంప‌తులు మ‌నీ లాండ‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు.

పెట్టుబ‌డుల పేరిట 8 వేల మందిని అమిత్ భ‌ర‌ద్వాజ అనే వ్య‌క్తి మోసం చేసిన‌ట్లుగా ఫిర్యాదులు అందాయి. ఫూణేకు చెందిన అమిత్ భ‌ర‌ద్వాజ్‌కు.. రాజ్ కుంద్రాకు మ‌ధ్య పెద్ద ఎత్తున లావాదేవీలు సాగిన‌ట్లుగా చెబుతున్నారు. బిట్ కాయిన్ లావాదేవీల్లో రాజ్ కుంద్రా పేరుంద‌ని.. అమిత్ భ‌ర‌ద్వాజ‌తో క‌లిసి ప‌లు లావాదేవీలు చేసిన‌ట్లుగా ఈడీ అధికారుల విచార‌ణ‌లో తేలింది.

అంతేకాదు.. పెట్టుబ‌డుల కోసం దుబాయ్ తో స‌హా ప‌లు దేశాల్లో రాజ్ కుంద్రా ప‌లు ఈవెంట్ల‌ను నిర్వ‌హించిన‌ట్లుగా తేల్చారు. ఈ నేప‌థ్యంలో సుదీర్ఘంగా విచారించిన అధికారులు ప‌లు వివ‌రాల్ని రాబ‌ట్టిన‌ట్లుగా తెలుస్తోంది.